Asianet News TeluguAsianet News Telugu

బొమ్మల షాపులో దారుణం: మహిళను చంపేసి శవంపై అత్యాచారం

మహారాష్ట్రలోని ఓ పట్టణంలో దారుణమైన సంఘటన చోటు  చేసుకుంది. బొమ్మల దుకాణానికి వెళ్లిన మహిళను ఆ దుకాణం యజమాని చంపేసి, శవంపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

shop keeper kills customer in Maharshtra
Author
Maharashtra, First Published Jul 4, 2020, 7:07 AM IST

ముంబై: మహారాష్ట్రలోని ఓ బొమ్మల దుకాణంలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నలాసోపారాలో బొమ్మల దుకాణంలో ఆ షాపు యజమాని బొమ్మలు కొనడానికి వచ్చిన మహిళను హత్య చేసి, ఆ తర్వాత శవంపై అత్యాచారం చేశాడు. 

భర్త, పిల్లలతో కలిసి ఉంటున్న 32 ఏళ్ల మహిళ బొమ్మలు కొందామని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.  దాంతో పాల వ్యాపారం చేసే భర్త తులింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు సాగించారు. 

ఈ క్రమంలో జూన్ 28వ తేదీన నలపోపారాలోని చందన్ నకా రోడ్ పక్కన పార్కు చేసిన ఉన్న కారులో ఓ మహిళ శవం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. శవం కుళ్లిపోయి దుర్వాసన వేస్తున్న స్థితిలో ఉంది. తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన తులింగ్ ను వెంట పెట్టుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

ఆ మృతదేహం తన భార్యదేనని తులింగ్ చెప్పాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్యకు గురైన మహిళపై అత్యాచారం జరిగిందని కూడా పోస్టుమార్టంలో తేలింది. పోలీసులు సిడీఐ సాయంతో విచారణ ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా కారు అక్కడే పార్కు చేసి ఉంటోందని స్థానికులు తెలిపారు. 

పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. జూన్ 26వ తేదీన ఆ కారు పార్కు చేసిన ప్రదేశంలో పక్కనే ఉన్న టాల్ స్టాయ్ దుకాణానికి మహిళ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమె కనిపించకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుని షాపు యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. షాపు యజమాన్ని నేరాన్ని అంగీకరించారు. 

మహిళ తన దుకాణానికి వచ్చిందని, తనతో గొడవ పడిందని, దాంతో తాను జట్టు పట్టుకుని ఆమెను గదిలోకి ఈడ్చుకుపోయి చంపేశానని, ఆ తర్వాత శారీరకంగా అనుభవించానని చెప్పాడు. ఒక రాత్రంతా శవంతో గడిపిన తర్వాత ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పక్కనే పార్కు చేసిన ఉన్న వాహనంలోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వివరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios