Asianet News TeluguAsianet News Telugu

ఆయన ఏదో ఒక రోజు దేశాన్ని ఏలుతాడు.. : రాహుల్ గాంధీపై శరద్ పవర్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ 'భారత్‌ జోడో యాత్ర' తర్వాత పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీని సీరియస్‌గా పరిగణిస్తున్నారని, ఏదో ఒక రోజు ఆయనే దేశానికి నాయకత్వం వహిస్తారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. 

Sharad Pawar says Rahul gandhi will lead the country someday KRJ
Author
First Published Oct 5, 2023, 5:22 AM IST

'భారత్ జోడో యాత్ర' తర్వాత రాహుల్ గాంధీని దేశ ప్రజలు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ అన్నారు. దేశాన్ని ఏదో ఒకరోజు రాహుల్ గాంధీ నడిపిస్తారనీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించి బుధవారానికి ఒక ఏడాది పూర్తి అయ్యింది. ఈ యాత్ర దేశంలోని అనేక రాష్ట్రాల గుండా 7 సెప్టెంబర్ 2022న బయలుదేరి 30 జనవరి 2023న శ్రీనగర్‌లో ముగిసిన విషయం తెలిసిందే.

ఇటీవల ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో శరద్ పవార్ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆయన  ఏదోక రోజు దేశానికి నాయకత్వం వహిస్తారని అన్నారు.  అన్నాఎన్‌సిపి తిరుగుబాటుదారులను ప్రస్తావిస్తూ.. ప్రజలు తమతో వెళ్ళిన వారు అని అన్నారు. బీజేపీ, ఎన్సీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలకు భయపడి పార్టీ మారారన్నారు. బీజేపీతో తమ పార్టీ చేతులు కలిపే ప్రసక్తే లేదని శరద్ పవార్ అన్నారు.

మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ చర్య భారత కూటమిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అదే సమయంలో.. శరద్ పవార్ ఢిల్లీ లోక్‌సభ స్థానాలపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో 50 శాతం లోక్‌సభ సీట్లు గెలుస్తాం - పవార్

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ప్రకటించారు. మహారాష్ట్రలో కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవార్ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నాలుగు సీట్లు మాత్రమే గెలిచాం. అయితే ఈసారి 50 శాతం సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios