Asianet News TeluguAsianet News Telugu

రైలులో శివాలయం... ఈశ్వరుడి కోసం స్పెషల్ బెర్త్.. ఫోటోలు వైరల్

సహజంగా మనుషులకు ట్రైన్ బెర్త్ లు రిజర్వ్ చేస్తారు కానీ ఇక్కడ శివుడికి బెర్త్ రిజర్వ్ చెయ్యటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఈ రైలు మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగుతున్న నేపధ్యంలో దీని ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఏర్పాటు చేశారు.

Seat Number 64 On Train Launched By PM Turned Into Temple For Lord Shiva
Author
Hyderabad, First Published Feb 17, 2020, 1:51 PM IST

వివిధ ప్రాంతాల్లో ఉండే ఆలయాలను దర్శించుకోవడానికి మనలో చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. అయితే..  ఓ రైలులో మాత్రం ఏకంగా ఆలయం ఏర్పాటు చేశారు. రైలులోని ఓ సీటుని శివుడికి ఏర్పాటు చేశారు. దీంతో... అది కూడా ఒక ఆలయంగా భావించి భక్తులు పూజలు చేస్తుండటం గమనార్హం. ఈ సంఘటన వారణాసిలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Seat Number 64 On Train Launched By PM Turned Into Temple For Lord Shiva

మూడు జ్యోతిర్లింగాలు కలుపుతూ సాగే కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ రైలుని ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా... ఆ రైలులో చిన్నపాటి   శివాలయం వెలిసింది. రైల్వే అధికారులు ఏకంగా పరమశివుడికి ఓ బెర్తునే రిజర్వ్ చేసేశారు. 

Also Read మోసపోయిన టెక్కీ.... నెయిల్ పాలిష్ ఖరీదు రూ.92వేలా..?

సహజంగా మనుషులకు ట్రైన్ బెర్త్ లు రిజర్వ్ చేస్తారు కానీ ఇక్కడ శివుడికి బెర్త్ రిజర్వ్ చెయ్యటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఈ రైలు మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగుతున్న నేపధ్యంలో దీని ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఏర్పాటు చేశారు.

Seat Number 64 On Train Launched By PM Turned Into Temple For Lord Shiva

బీ5 బోగిలోని 64వ నెంబర్ సీటుని ఈశ్వరునికి కేటాయించారు. శివుడి ఫోటో పెట్టి.. అందంగా పూలతో అలంకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ రైలు మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓంకారేశ్వర్ ను, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ను, యూపీ.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ ను అంటే మూడు జ్యోతిర్లింగాలను కలిపుతూ వెళ్తుండటం దీని విశేషం. ఈ నెల 20వ తేదీ నుంచి దీని సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios