Prakash Raj: సనాతన ధర్మానికి సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయనకు హత్య బెదిరింపులు వచ్చాయి. సంచలన ప్రకటనల కారణంగానే ఆయన చాలాసార్లు ఇబ్బందుల్లో పడ్డాడు. తాజాగా కూడా అలాంటిదే జరిగింది.  

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలామంది టాప్ దర్శక,నిర్మాతలు వాళ్ళ సినిమాలో ప్రకాష్ రాజ్ వుండాలని అనుకుంటారు. అలాగే ఆయనకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. కానీ, తరుచు ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. సమస్యల పట్ల అతని బహిరంగ విధానం అతన్ని వెలుగులోకి తీసుకువస్తుంది. తన సంచలన ప్రకటనల కారణంగా.. ప్రకాష్ రాజ్ చాలాసార్లు ఇబ్బందుల్లో పడ్డాడు. ఇటీవల కూడా అలాంటి ప్రకటన కారణంగా వార్తల్లో నిలిచారు. 

తాజాగా నటుడు ప్రకాష్ రాజ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. సనాతన ధర్మానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ప్రకారీ రాజ్ ఇటీవల సనాతన ధర్మానికి సంబంధించి వివాదాస్పద ప్రకటన ఇచ్చాడని, ఆ తర్వాత అతను సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేయబడిన విషయం తెలిసిందే. బెదిరింపులు వచ్చిన తరువాత నటుడు ప్రకాష్ రాజ్ ఒక యూట్యూబ్ ఛానెల్‌పై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ యూట్యూబర్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నటుడు ప్రకాష్ రాజ్‌ని చంపేస్తానని బెదిరిస్తున్న వీడియోను చూపించినందుకు గాను ఓ యూట్యూబ్ ఛానెల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నటుడు బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెంట్రల్ డీసీపీ మాట్లాడుతూ.. 'రెండు రోజుల క్రితం అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

మీడియా కథనాల ప్రకారం.. ప్రకాష్ రాజ్‌పై బెదిరింపుతో కూడిన వీడియోను యూట్యూబ్‌లో వేలాది మంది వీక్షించబడినట్లు సమాచారం. అటువంటి పరిస్థితిలో టీవీ విక్రమ ఛానెల్ వీడియోలో తనను, అతని కుటుంబ సభ్యులను ప్రతికూలంగా చిత్రీకరించారని నటుడు ఫిర్యాదు చేశారు. నటుడి ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.