Asianet News TeluguAsianet News Telugu

జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల ‘గుప్త’ విరాళాలు.. ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకే అధికం.. తేల్చిన ఏడీఆర్..

జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు వచ్చిన గుప్తనిధులకు సంబందించిన కీలక వివరాలను ఏడీఆర్ బయటపెట్టింది. ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి నిధులు వైసీపీకి ఎక్కువగా వస్తున్నాయని తేల్చింది. 

Rs. 15,077 crore 'unknown' donations to national parties, YCP most among regional parties : ADR
Author
First Published Aug 27, 2022, 8:02 AM IST

ఢిల్లీ : ఎన్నికల విధానాలకు సంబంధించి కీలక నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020- 21 మధ్య జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల గుప్త విరాళాలు (గుర్తుతెలియని మూలాల నుంచి) రూపంలో అందినట్లు తన నివేదికలో పేర్కొంది. ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.690.67  కోట్లు ఈ రూపంలో విరాళంగా అందినట్లు  తెలిపింది.  మొత్తం ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను ఏడీఆర్  పరిగణలోకి తీసుకుంది. 2004-05, 2020-21 మధ్య కాలంలో ఆయా పార్టీలు ఎన్నికల సంఘం దగ్గర సమర్పించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్ లు, డొనేషన్ కు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్ తెలిపింది,

- 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఎనిమిది జాతీయ పార్టీలు తమకు గుర్తుతెలియని మూలాల నుంచి రూ.426.74  కోట్లు వచ్చినట్లు పేర్కొన్నాయని ఏడీఆర్ పేర్కొంది. 27  ప్రాంతీయ పార్టీల నుంచి రూ. 263.92 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నాయి అని తెలిపింది.

మ‌రోసారి ప్రధాని మోదీయే నెంబర్. 1 .. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయ‌కుడ‌యనే.. ఆ తర్వాతే ఇంకెవరైనా ..

- 2020-21  ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 178.782 కోట్లు గుప్త విరాళాలు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. జాతీయ పార్టీలకు వచ్చిన ఇటువంటి విరాళాల్లో ఈ వాటా 41.89 శాతం కావడం గమనార్హం.

- ఇదే కాలానికి గుర్తుతెలియని మూలాల నుంచి రూ.100.502  కోట్లు విరాళాలు వచ్చినట్లు బిజెపి పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిసింది.

- ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఇదే ఆర్థిక సంవత్సరంలో ఐదు పార్టీలకు అత్యధికంగా ఈ తరహా నిధులు అందుతున్నాయి. ఇందులో వైసిపి రూ.96.25కోట్లతో అగ్రస్థానంలో ఉంది. డీఎంకే రూ.80.02కోట్లు, బిజెడి రూ.67  కోట్లు,  ఎంఎన్ఎస్ రూ.5.77  కోట్లు, ఆప్ రూ.5.4 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

- జాతీయ, ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ. 690.67 కోట్ల నిధుల్లో 47.06ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చినట్లు ఏడీఆర్  తెలిపింది.

జాతీయ పార్టీలు (8) :  బిజెపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎన్సీపీ,  బి ఎస్ పి,  నేషనల్ పీపుల్స్ పార్టీ.

ప్రాంతీయ పార్టీలు (27) :  ఆప్, ఏజీపీ,  ఏఐఐఏ డిఎంకె,  ఏఐఎఫ్ బీ, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్, బిజెడి,  సిపిఐ ( ఎమ్మెల్) ( ఎల్),  డిఎండికె,  డిఎంకె,  జిఎఫ్పీ, జేడీఎస్, జేడీయూ, జేఎంఎం, కేసీ-ఎం, ఎంఎన్ఎస్, ఎన్ డీపీపీ, ఎన్ ఫీఎఫ్, పీఎంకే, ఆర్ఎల్ డీ, ఎస్ఏడీ, ఎస్డీఎఫ్, శివసేన, ఎస్కేఎం, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపి. 

Follow Us:
Download App:
  • android
  • ios