ప్రముఖ ఆర్కిటెక్ట్, పద్మభూషణ్ గ్రహీత బాలకృష్ణ దోషి ఇక లేరు..
ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి కన్నుమూశారు. పద్మ శ్రీ, పద్మ భూషణ్ వంటి అవార్డులను అందుకున్న ఆయన ఎన్నో అద్భుత కట్టడాలకు రూపం ఇచ్చారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు.
ప్రముఖ భారతీయ వాస్తుశిల్పి, పద్మ శ్రీ, పద్మ భూషణ్ గ్రహీత బాలకృష్ణ దోషి వృధాప్య సంబంధిత అనారోగ్య కారణాల వల్ల మంగళవారం మరణించారు. బీవీ దోషి అని కూడా పిలుచుకునే ఆయనకు ప్రస్తుతం 95 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల ఆర్కిటెక్చర్ డైజెస్ట్ ఆఫ్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. ఇంస్టాగ్రామ్ లో సంతాపాన్ని వ్యక్తం చేసింది.
సర్జికల్ స్ట్రైక్ ఆధారాలేవి అని ప్రశ్నించిన దిగ్విజయ్ సింగ్.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
‘‘రూపం, వెలుగుల్లో దిట్ట అయిన దోషి చెరగని వారసత్వాన్ని మిగిల్చారు. ఆయన ప్రేమ గల భర్త, తండ్రి, తాత. దేశ ప్రజలకు నిజమైన స్ఫూర్తి’’ అని పేర్కొంది. ‘‘క్రీస్తు శకంలో మాకు ఇది హృదయ విదారకమైన నష్టం. మమ్మల్నందరినీ ఎంతగానో స్పృశించిన ఆయన చిన్ననాటి ఉత్సాహాన్ని, ఉత్సుకతను, వినయాన్ని మనం కోల్పోతాము.’’ అని పోస్ట్ చేసింది.
ఆయన మృతి ప్రధాని నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. ‘‘డాక్టర్ బి.వి.దోషి ఒక అద్భుతమైన ఆర్కిటెక్ట్. అద్భుతమైన సంస్థ బిల్డర్. భారతదేశం అంతటా ఆయన గొప్ప పనిని ప్రశంసించడం ద్వారా రాబోయే తరాలు గొప్పతనాన్ని చూస్తాయి. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.’’ అని ట్వీట్ చేశారు.
బాలకృష్ణ దోషి లే కార్బుసియర్, లూయిస్ కాన్ ఆధ్వర్యంలో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి సత్కరించింది. 2018లో నోబెల్ ఆర్కిటెక్చర్ ప్రైజ్గా భావించే ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ వాస్తుశిల్పిగా రికార్డు నెలకొల్పారు. 2022లో ఆయనకు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ రాయల్ గోల్డ్ మెడల్ లభించింది.