వాళ్లు బాలకార్మికుల కిందికి వస్తారు.. రవీంద్ర జడేజా మాజీ భార్యపై సోదరి ఫైర్..
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా మాజీ భార్య, ఆయన సోదరి బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తన మాజీ వదినపై జడేజా సోదరి నైనాబా విరుచుకుపడింది.
గుజరాత్ : గుజరాత్ రాజకీయ పోరు రసవత్తరంగా సాగుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, క్రికెటర్ రవీంద్ర జడేజా సోదరి, కాంగ్రెస్ ప్రచారకర్త నైనబా తన వదిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి రివాబా జడేజాపై తాజాగా నిప్పులు చెరిగారు. మంగళవారం విలేకరుల సమావేశంలో నైనాబా మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల ప్రచారానికి పిల్లలను ఉపయోగించుకున్నందుకు రివాబాపై కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తుందన్నారు.
సానుభూతి పొందేందుకు రివాబా పిల్లలను వాడుకుంటున్నారని.. ఒకరకంగా దీన్ని చైల్డ్ లేబర్ అని పిలుస్తున్నారని, ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ అధికారులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని నైనాబా విలేకరులతో అన్నారు. రాజ్కోట్ వెస్ట్ నుండి ఓటరు అయినప్పటికీ, రివాబా జామ్నగర్ నార్త్లో ఎలా పోటీ చేసి ఓట్లు అడగగలరని కాంగ్రెస్ నాయకురాలు మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
వివాదంలో యువరాజ్ సింగ్.. నోటీసులు జారీ చేసిన గోవా టూరిజం శాఖ..
తన వదిన అధికారిక పేరు రివా సింగ్ హర్దేవ్ సింగ్ సోలంకి అని కూడా నైనబా తన ఎన్నికల పత్రంలో సూచించింది. "ఆమె రవీంద్ర జడేజా పేరును బ్రాకెట్లో పెట్టుకుంది. ఇది జడేజా ఇంటిపేరును ఉపయోగించుకోవడం కోసం మాత్రమే. వివాహం జరిగిన ఆరేళ్లలో, ఆమెకు పేరును సవరించుకోవడానికి సమయం లేదు" అని నైనబా ఆరోపించారు.
రవీంద్ర జడేజా కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళా సభ్యులు (అతని భార్య, అతని సోదరి) ముఖాముఖికి రావడంతో జామ్నగర్ నార్త్ సీటులో తీవ్రమైన రాజకీయ పోరు ఉంటుందని భావిస్తున్నారు. భారత ఆల్రౌండర్ భార్య బిజెపి టిక్కెట్పై పోటీ చేస్తుండగా, అతని సోదరి జామ్నగర్ నార్త్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు, నైనాబా తన వదిన 'సెలబ్రిటీ' కాబట్టి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, జామ్నగర్ ప్రజలు స్థానిక నాయకుడిని గెలిపించి, తమ పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
డిసెంబర్ 1న ఎన్నికలు జరగనున్న 89 అసెంబ్లీ స్థానాల్లో జామ్నగర్ నార్త్ ఒకటి. నవంబర్ 10న బీజేపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్రసింగ్ జడేజాను పక్కనబెట్టి రవిబా జడేజాను బరిలోకి దింపింది.