Asianet News TeluguAsianet News Telugu

మ‌హిళా కానిస్టేబుల్ పై అత్యాచారం: బీఎస్ఎఫ్ కమాండర్ పై కేసు న‌మోదు, సస్పెండ్

Kolkata: పశ్చిమ బెంగాల్ లో ఒక మహిళా పోలీసుపై అత్యాచారానికి పాల్పడ్డ‌డ‌నే ఆరోప‌ణ‌ల మ‌ధ్య సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్ వేటుకు గుర‌య్యాడు. దీనిపై స్పందించాలని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ చేసిన ట్వీట్ తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
 

Raping Woman constable in West Bengal: Case registered against BSF commander, and suspended
Author
First Published Feb 22, 2023, 3:58 PM IST

BSF inspector suspended on rape charges: పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లాలోని ఓ క్యాంపులో మహిళా బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్ ) ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. వివ‌రాల్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్ లో ఒక మహిళా పోలీసుపై అత్యాచారానికి పాల్పడ్డ‌డ‌నే ఆరోప‌ణ‌ల మ‌ధ్య సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్ వేటుకు గుర‌య్యాడు. దీనిపై కేంద్రం స్పందించాలని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ చేసిన ట్వీట్ తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణ జరుగుతున్నందున ఈ ఘటనపై మరింతగా స్పందించడం తొందరపాటే అవుతుందని బీఎస్ఎఫ్ అధికారి పేర్కొన్నారు. కాగా, మహిళా కానిస్టేబుల్ పై ఫిబ్రవరి 18, 19 తేదీల మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు స‌మాచారం. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు. 

కిషన్ గంజ్ ప్రాంతంలోని సరిహద్దు ఔట్ పోస్టులో మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై బీఎస్ ఎఫ్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేసి, అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు ఆ దళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. నదియా జిల్లా ఔట్ పోస్టులోని తుంగి బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్ స్పెక్టర్ ఫిబ్రవరి 19న ఓ మహిళా బీఎస్ ఎఫ్ కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డాడ‌ని ఫిర్యాదు న‌మోదైంది. దీనిపై స్పందించాలని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ చేసిన ట్వీట్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేసి అతనిపై శాఖాపరమైన విచారణ చేపట్టామ‌ని బీఎస్ఎఫ్ ఉన్న‌తాధికారి తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు.

"నదియా క్యాంప్ లోని కృష్ణగంజ్ లో ఓ మహిళా బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై బీఎస్ఎఫ్ కమాండర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బీఎస్ఎఫ్ బాధితురాలిని ఎస్ఎస్కేఎంకు తీసుకువచ్చింది. అప్పుడు భవానీపూర్ పీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. కమాండర్ ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని"  కునాల్ ఘోష్ ప్ర‌శ్నించారు. పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్లకు బదులుగా 50 కిలోమీటర్ల పరిధిలో సెర్చ్, స్వాధీనం, అరెస్టులు చేపట్టడానికి దళానికి అధికారం ఇవ్వడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2021 లో బిఎస్ఎఫ్ చట్టాన్ని సవరించిందని గుర్తు చేశారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో బెంగాల్ లో ఇది ప్రధాన రాజకీయ అంశంగా మారింది.

గతేడాది రాజస్థాన్ లో బీెస్ఎప్ సిబ్బంది సామూహిక అత్యాచారం.. 

2022లో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది సహా ఐదుగురిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. సిబ్బంది ప్రమేయం తర్వాత బీఎస్ఎఫ్ అధికారులకు సమాచారం అందించామనీ, ఆ తర్వాత ముగ్గురు జవాన్లను దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios