Rajasthan polls: రాజస్థాన్ లో మొత్తం అసెంబ్లీ 200 ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ప్రతిపక్ష బీజేపీ 73 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 26 స్థానాలకు దక్కించుకున్నారు.
Rajasthan Assembly elections: వచ్చే ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తర్వాతి సంవత్సరం లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్లు ఆయా రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిల్లో విజయం సాధించి.. లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే దూకుడు పెంచిన బీజేపీ.. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో ఆ పార్టీ అగ్రనేతలు పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇక రాజస్థాన్లో కూడా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
2023లో జరిగే రాజస్థాన్ ఎన్నికలపై దృష్టి సారించింది బీజేపీ. ఈ క్రమంలోనే తన కేడర్కు శిక్షణ ఇచ్చేందుకు రాజస్థాన్లో 3 రోజుల శిబిరాన్ని బీజేపీ ప్లాన్ చేసిందని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో జూలై 10 నుండి 12 వరకు మూడు రోజుల శిక్షణా శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం రాజస్థాన్లోని మౌంట్ అబూలో జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాబోయే ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన శిబిరంలో బీజేపీకి చెందిన పలువురు జాతీయ హోదా నాయకులు ఎన్నికల వ్యూహాలను అందిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జులై 10న శిక్షణా శిబిరం ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు శనివారం జైపూర్లో ఉంటారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఒక హిందూ వ్యక్తి తల నరికి చంపిన తర్వాత రాష్ట్రంలోని పరిస్థితిని చర్చించడానికి రాజస్థాన్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన మూడు రోజుల సమావేశాన్ని అనుసరించి శిక్షణా శిబిరం జరిగింది. రాజస్థాన్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలోని వర్గాలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
ఆ శిక్షణ శిబిరంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వి సతీష్, బిఎల్ సంతోష్, రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, కేంద్ర మంత్రులు కైలాష్ చౌదరి, అర్జున్ రామ్ మేఘ్ వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహా పలువురు సీనియర్ నాయకులు మూడు రోజుల పాటు జరిగే శిక్షణా శిబిరంలో పాలుపంచుకోనున్నారు. అలాగే, వివిధ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశం కూడా ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ శిక్షణ శిబిరంలో రాజస్థాన్లో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బూత్ స్థాయి నిర్వహణతో సహా ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. రాజస్థాన్ లో మొత్తం అసెంబ్లీ 200 ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ప్రతిపక్ష బీజేపీ 73 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 26 స్థానాలకు దక్కించుకున్నారు.
