Asianet News TeluguAsianet News Telugu

Udaipur Murder Case : రాడికలైజేషన్ ను నియంత్రించాలి.. హింస ఎలాంటిదైనా ఖండించాలి.. అసదుద్దీన్ ఓవైసీ..

నిరసనలు చట్టపరిధిలో ఉండాలని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోలేరని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.

Radicalisation Has To Be Controlled : Asaduddin Owaisi On Udaipur Murder
Author
hyderabad, First Published Jun 29, 2022, 10:04 AM IST

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తాలిబన్ తరహాలో ఇద్దరు వ్యక్తులు దర్జీ గొంతు కోసి చంపిన ఘటన తరువాత.. దేశంలో చెలరేగుతున్న హింసను ఖండించాలని, "రాడికలైజేషన్‌ను నియంత్రించాలని" AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

"నేను ఇక్కడ సుఖంగా కూర్చుని ఉదయపూర్‌లో ఆ పేద టైలర్‌కి ఏం జరిగిందో దాన్ని నేను ఖండించలేను, కానీ అదే సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం రాజస్థాన్‌ లేదా జైపూర్‌లో జరిగిన ప్రతీ హింసాత్మక చర్యను ఖండించాలి. రాడికలైజేషన్‌ను నియంత్రించాలి. అందుకే నేను మన దేశంలో జరుగుతున్న రాడికలైజేషన్‌ను పర్యవేక్షించడానికి MHAలోని యాంటీ-రాడికలైజేషన్ సెల్ ఒక నిర్దిష్ట మతానికి మాత్రమే కాకుండా ప్రతి మతానికి ఉండాలని డిమాండ్ చేస్తున్నాను”అన్నారాయన.

ఇవేవీ లేకుండా దీన్ని నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందే.. ఈ వ్యక్తులు చేసింది దారుణమైన నేరం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి అనాగరికమైన పనికిమాలిన పని చేసే హక్కు ఎవరికీ లేదు’’ అని ఒవైసీ అన్నారు. ఉదయపూర్‌లో రద్దీగా ఉండే మార్కెట్‌లో కన్హయ్య లాల్ తన దుకాణంలో ఉండగా మధ్యాహ్నం పూట ఇద్దరు వ్యక్తులు దుకాణంలోకి ప్రవేశించారు. క్షణాల్లో అతడి మీద కత్తితో దాడి చేశారు. దీన్నంతా వీడియో తీశారు. హంతకులు దర్జీని ఎలా హత్య చేశారో చెబుతూ.. సంతోషపడుతున్న దృశ్యాలు  వీడియోలో కనిపించాయి. ఆ తరువాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ హత్య విజువల్స్ చూసి తాను చాలా డిస్టర్బ్ అయ్యానని హైదరాబాద్ ఎంపీ అన్నారు. ఈ హత్యను తీవ్రవాద ఘటనగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రవక్త మహమ్మద్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి.. దేశ విదేశాల్లో వివాదానికి కారణమైన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో మద్దతు తెలిపారు. దీంతో దర్జీని కొన్ని గ్రూపులు చాలాసార్లు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

Udaipur Murder Case: ఉదయపూర్ లో టెన్ష‌న్.. టెన్షన్.. రంగంలోకి NIA.. తాజా అప్‌డేట్‌లు ఇవిగో..

"ఈ సమయంలో ఎలాంటి హింసనైనా ఖండించాలి. దానిని అసమానంగా ఖండించాలి. ఈరోజు దారుణమైన హత్య జరిగినట్లు కాదు, రేపు ఇంకేదో జరిగితే వెనుకడుగు వేస్తాం. కాబట్టి దేనికైనా ఖండించాలి. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా హింస ఎవరు చేసినా.. చట్టబద్ధమైన పాలన సాగాలని మేం డిమాండ్ చేస్తున్నాం. హింసకు పాల్పడిన వారందరికీ చట్టాన్ని సమానంగా వర్తింపజేయాలి" అని ఆయన నొక్కి చెప్పారు.

దేశంలో ఈ స్థాయి హింసకు చేరుకోవడం ఎలా జరిగిందని ప్రశ్నించగా, "ఇది చాలా సుదీర్ఘమైన చర్చ" అని ఎంపీ అన్నారు. పోలీసు, ప్రభుత్వంలో ముస్లిం ప్రాతినిధ్యాలు తక్కువగా ఉన్నాయని కూడా అతను గుర్తించాడు. "పోలీసుల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని చూడండి, పోలీసుల్లో ముస్లింల పోస్టింగ్‌లను చూడండి. కేంద్రంలో ఎంత మంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వానికి చెవులు, కళ్ళుగా మారారు. ఇవి వారి స్థాయిలో ప్రభుత్వం చూడవలసిన అంశాలు" అని ఆయన అన్నారు. 

నిరసనలు చట్ట పరిధిలోనే ఉండాలని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోలేరని ఒవైసీ స్పష్టం చేశారు. "మేము చేస్తున్న ఏకైక విజ్ఞప్తి ఏమిటంటే హింస ద్వారా మీరేం సాధించలేరు. రాజ్యాంగానికి లోబడే నిరసన తెలపాలి. అదే మనం చేయాల్సింది. అదే సమయంలో ప్రజల్ని పాలించే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏమీ జరగదన్న విశ్వాసాన్ని సృష్టించాలి. ఎలాంటి హింసనైనా ఖండించాలి. చట్టబద్ధమైన పాలన సాగాలి ”అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios