Asianet News TeluguAsianet News Telugu

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించండి: సమాజ్ వాదీ పార్టీ

New Delhi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతుండగా, కోటాలో (వ‌ర్గాల వారీగా) రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ కు విపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చను ప్రారంభించిన సోనియాగాంధీ బిల్లు అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదని బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతును ప్రకటించారు. అయితే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలకు చెందిన మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కుల గణన నిర్వహించాలని ఆమె అన్నారు.

Provide reservation for SC, ST, OBC and minority women: Samajwadi Party MP Dimple Yadav RMA
Author
First Published Sep 20, 2023, 5:25 PM IST

women's reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం మైనారిటీలు, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ ఎప్పటి నుంచో భావిస్తోందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతుండగా, కోటాలో (వ‌ర్గాల వారీగా) రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ కు విపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చను ప్రారంభించిన సోనియాగాంధీ బిల్లు అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదని బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలకు చెందిన మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కుల గణన నిర్వహించాలని ఆమె అన్నారు. కాగా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ స‌భ‌లో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది ప్రత్యేకమైన,  ముస్లిం మహిళా వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా రాజ్యాంగ (128 స‌వరణ) బిల్లు 2023పై జరిగిన చర్చలో పాల్గొన్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ఆ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తయిన తర్వాత బిల్లును తీసుకువస్తోందనీ, జనాభా గణన ఎప్పుడు నిర్వహిస్తారో, కుల సంబంధిత జనాభా గణనను నిర్వహిస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీఎస్పీ ఎంపీ సంగీత ఆజాద్ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాజ్యాంగంలో మహిళలకు అంబేద్క‌ర్ గౌరవం ఇచ్చారన్నారు. ఈ బిల్లుకు బీఎస్పీ మద్దతిచ్చినప్పటికీ కొన్ని డిమాండ్లు ఉన్నాయని ఆజాద్ తెలిపారు. రాష్ట్రాలు, కేంద్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్లతో పాటు ఓబీసీ రిజర్వేషన్లు చేర్చాలని కోరారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ప్రభుత్వానికి ఎన్నికల అంశంగా మాత్రమే మారకూడ‌దనీ, 2024 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లను తీసుకురావాలని బీఎస్పీ ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేసిన మంచి పనుల కారణంగానే ఈ బిల్లును ముందుకు తెచ్చామని బీజేడీ ఎంపీ శర్మిష్ఠ సేథీ అన్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చార‌ని తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడింట ఒక వంతు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపిన తొలి పార్టీ బీజేడీయేనని సేథీ గుర్తు చేశారు. జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ లాలన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతును వ్యక్తం చేశారు, అయితే ఈ బిల్లును తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం కాదనీ, బీజేపీ కూటమి ఏర్పాటుపై భయాందోళనలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇది 2024 ఎన్నికల కోసం వేసిన ఎత్తుగడ అని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2021లో కుల గణన ప్రారంభించి ఉండేదని లాలన్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios