Asianet News TeluguAsianet News Telugu

లక్షద్వీప్ ప్రజల ఆతిథ్యంపై ధన్యవాదాలు: సోషల్ మీడియా వేదికగా మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  దక్షిణాదిపై ఫోకస్ పెట్టారు.  రెండు రోజుల క్రితం లక్షద్వీప్ లో మోడీ పర్యటించారు. 
 

Prime minister narendra modi shared pictures of lakshadweep lns
Author
First Published Jan 4, 2024, 3:22 PM IST

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  మంగళవారంనాడు లక్షద్వీప్ లో పర్యటించారు. లక్షద్వీప్ పర్యటన సమయంలో  స్థానికులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.  ఈ విషయమై  సోషల్ మీడియాలో  ఫోటోలను  షేర్  చేశారు.

 

 లక్షద్వీప్ వాసుల ఆతిథ్యంపై  మోడీ  సంతోషం వ్యక్తం చేశారు.ద్వీపాల మధ్య అద్భుతమైన ప్రాంతం లక్షద్వీప్ గా ఆయన పేర్కొన్నారు.   సోమ, మంగళవారాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు, కేరళ రాష్ట్రంలోని లక్షద్వీప్ లో మోడీ పర్యటించారు.

 

తమిళనాడు  తిరుచిరాపల్లిలో వేలాది కోట్ల రూపాయాల ప్రాజెక్టులకు  మోడీ  శంకుస్థాపన చేశారు.  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో  దక్షిణాదిపై  బీజేపీ ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో పలు ప్రాజెక్టులకు  మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios