ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టారు. రెండు రోజుల క్రితం లక్షద్వీప్ లో మోడీ పర్యటించారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారంనాడు లక్షద్వీప్ లో పర్యటించారు. లక్షద్వీప్ పర్యటన సమయంలో స్థానికులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Scroll to load tweet…
లక్షద్వీప్ వాసుల ఆతిథ్యంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు.ద్వీపాల మధ్య అద్భుతమైన ప్రాంతం లక్షద్వీప్ గా ఆయన పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు, కేరళ రాష్ట్రంలోని లక్షద్వీప్ లో మోడీ పర్యటించారు.
Scroll to load tweet…
తమిళనాడు తిరుచిరాపల్లిలో వేలాది కోట్ల రూపాయాల ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో పలు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
Scroll to load tweet…
