Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు 2022కు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 కాగా, ఎన్నికలు జూలై 18న నిర్వహించనున్నారు.
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోనప్పటికీ, BJP తన పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఈరోజు నిర్వహించనుంది. ప్రతిపక్ష పార్టీల మధ్య సైతం నేడు కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలు 2022కు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 కాగా, ఎన్నికలు జూలై 18న నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నేడు జరిగే సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొంటారని సమాచారం. వాస్తవానికి బీజేపీ ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలను పర్యవేక్షించేందుకు బీజేపీ ఇప్పటికే 14 మంది సభ్యుల నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసింది. నామినేషన్లకు వారం రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఇరువర్గాలు ప్రజాభిమానం ఉన్న అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
బీజేపీ దూకుడు !
ఈ వారం చివరిలోగా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ ముందుగా నిర్ణయించుకుంది. అధికార పార్టీకి సొంతంగా 49% ఎలక్టోరల్ కాలేజీ ఉంది మరియు రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే 50% మార్కును దాటాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్లకు ఎన్డిఎతో పాటు ఇతర మిత్రపక్షాల మద్దతును కూడగట్టే బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నేతలు ఇతర ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపారు. బీజేపీ కూడా ఒక విధమైన 'క్రాక్ టీమ్'ని ఏర్పాటు చేసింది. ఇందులో అనేక మంది కేంద్ర మంత్రులు మరియు సీనియర్ కార్యకర్తలు కూడా వివిధ సంభావ్య అభ్యర్థులతో మాట్లాడుతూ తమ స్వంత సమన్వయంతో వ్యవహరిస్తున్నారు.
పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన వ్యక్తిగతంగా హాజరవుతాడా? వర్చువల్ గా హాజరు అవుతాడా? అనేది తెలియాల్సి ఉంది. సమావేశం తర్వాత, 'క్రాక్ టీమ్'తో సంప్రదింపులు ఉంటాయి, అక్కడ ప్రధానమంత్రికి ఎంపికల గురించి వెల్లడించనున్నారు. దీని తర్వాత కూడా పార్లమెంటరీ బోర్డు మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
ప్రతిపక్షాలులు సైతం !
అధికారపార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడానికి ఈ రోజు సమావేశమవుతుండగా, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాయి. విపక్ష శిబిరంలో రసవత్తరంగా చర్చలు సాగుతున్నాయి. మమతా బెనర్జీ ఈరోజు తరువాత జరిగే ప్రతిపక్ష సమావేశానికి దూరంగా ఉండనున్నారని సమాచారం. ఆమె మేనల్లుడు మరియు తృణమూల్ నాయకుడు అభిషేక్ బెనర్జీ హాజరయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రతిపక్షం రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాలన్న అభ్యర్థనను ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు తిరస్కరించారు. NCP నాయకుడు శరద్ పవార్, జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ ఇప్పటివరకు ఆఫర్లను తిరస్కరించారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం వ్యూహరచన చేసేందుకు 17 పార్టీల ప్రతిపక్ష నేతలు నేడు శరద్ పవార్ నివాసంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి పై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
