Asianet News TeluguAsianet News Telugu

"బిజెపిని ఓడించలేం...": ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సలహా

ప్రతిపక్షాల ఐక్యత ఒక ముఖద్వారమని, పార్టీలను లేదా నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం వల్ల బీజేపీని ఓడించలేమని ఎన్నికల వ్యూహకర్త, జాన్ సూరజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Prashant Kishor's Advice For Opposition BJP Cant Be Defeated, Unless
Author
First Published Mar 21, 2023, 5:21 AM IST

ప్రశాంత్ కిషోర్ సలహా: 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రతిసారీలాగే ఈసారి కూడా విపక్షాల ఐక్యత పరిమళిస్తోంది. వీటన్నింటి మధ్య, ఎన్నికల వ్యూహకర్త, జాన్ సూరజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పికె బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత అస్థిరంగా , సైద్ధాంతికంగా భిన్నంగా ఉన్నందున 2024లో ఎప్పటికీ పనిచేయదని జోస్యం చెప్పారు.

దీనితో పాటు.. ఆయన ఎన్నికల వ్యూహకర్త రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చర్చించారు. విపక్షాల ఐక్యత కేవలం ముఖద్వారమేనని, కేవలం పార్టీలను, నాయకులను ఒక్కతాటిపైకి తీసుకురావడం సాధ్యం కాదని అన్నారు. ఇటీవల ఆయన ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  2024 ఎన్నికల గురించి చర్చించి, ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ఏమన్నారు?

పార్టీలను, నేతలను ఏకతాటిపైకి తీసుకుని బీజేపీని సవాల్ చేయలంటే.. బీజేపీ బలాన్ని అర్థం చేసుకోవాలి.. హిందుత్వ, జాతీయవాదం, లబ్ధిదారులే బీజేపీకి బలాలు.. పోరాడాలంటే పని చేయాల్సి ఉంటుందని పీకే అన్నారు. సిద్దాంతాలకు వ్యతిరేకంగా కూటమిలు ఏర్పాటు చేసుకున్నా.. ఐక్యత ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. బీహార్‌లో మహాకూటమి అనేది కేవలం పార్టీల కూటమి కాదు.. ఇది సిద్ధాంతాల కూటమి అన్నారు. 

హిందుత్వ భావజాలంపై పోరాడాలంటే సిద్ధాంతాల కూటమి ఉండాలనీ,గాంధీవాది, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు.. భావజాలం చాలా ముఖ్యమైనది, కానీ భావజాలం ఆధారంగా గుడ్డి విశ్వాసాన్ని కలిగి ఉండకూడదని అన్నారాయన. మీడియాలో మీరు ప్రతిపక్ష కూటమిని పార్టీలు,నాయకులు కలిసి రావడం అని చూస్తున్నారు. ఎవరు ఎవరితో భోజనం చేస్తున్నారు, ఎవరిని టీకి ఆహ్వానిస్తారు.. నేను దానిని భావజాల నిర్మాణంలో చూస్తాను. అప్పటి వరకు సైద్ధాంతిక పొత్తు జరగదు, బీజేపీని ఓడించే అవకాశం లేదని అన్నారు.  


గాంధీ కుటుంబంతో వివాదంపై పీకే

తనకు, గాంధీ కుటుంబానికి మధ్య విభేదాల గురించి పికె మాట్లాడుతూ..కాంగ్రెస్‌ను పునరుద్ధరించడమే తన లక్ష్యమని, ఎన్నికల్లో గెలవడమే అంతిమ లక్ష్యమని అన్నారు. రాహుల్ కోరుకున్న విధంగా.. తాము అంగీకరించలేదని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విషయానికొస్తే.. ఆయన చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రపై చూపే ప్రభావమే నిజమైన పరీక్ష అని అన్నారు. ఇది కేవలం పాద యాత్రనే కాదు. ఆరు నెలల భారత్ జోడో యాత్రలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios