ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన వైద్య వృత్తిలో వున్న ఓ డాక్టర్ ఓ నిరుపేద బాలుడి పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరించి తీవ్రంగా గాయపర్చిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. 

అస్సాం: ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన వైద్య వృత్తిలో వున్న ఓ డాక్టర్ ఓ నిరుపేద బాలుడి పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరించి తీవ్రంగా గాయపర్చిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. మైనర్ బాలుడితో చట్టవిరుద్దంగా తన ఇంట్లో వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాకుండా అతడిపై సలసలకాగే వేడినీటిని అతడిపై చల్లి అత్యంత దారుణంగా వ్యవహరించాడు సదరు డాక్టర్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డిబ్రూగర్ లోని అస్సాం మెడికల్ కాలేజ్ ఆండ్ హాస్పిటల్ లో సిద్దిప్రసాద్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య మిథాలీ ఓ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఇలా బాధ్యాతయుతమైన వృత్తుల్లో ఈ దంపతులు ఓ చిన్నారి విషయంలో దారుణంగా వ్యవహరించారు. 

read more వాచ్ మెన్ ను కారుతో తొక్కేసిన యువతి.. ఇంటికి వెళ్లి..

12ఏళ్ల బాలుడిని తమ ఇంటి పనుల కోసం నియమించుకున్న ఈ దంపతులు అతడిచేత వెట్టిచాకిరి చేయించుకునేవారు. ఇలా చట్టవ్యతిరేకంగా మైనర్ బాలుడితో చాకిరీ చేయించుకోవడమే కాకుండా తాజాగా అతడిని తీవ్రంగా గాయపర్చారు. నిద్రిస్తున్న బాలుడిపై సలసలకాగే వేడినీటిని పోసి ఈ దంపతులు రాక్షసుల్లా వ్యవహరించారు. వారి వికృత చేష్టలతో పాపం బాలుడికి తీవ్ర గాయాలవగా కనీసం వైద్యసాయం అందించడానికి కూడా ముందుకురాలేదు ఈ కసాయి డాక్టర్. 

అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఈ దంపతులను అరెస్ట్ చేశారు. వారిపై బాలకార్మిక చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు కోలుకున్నాక చైల్డ్ కేర్ సెంటర్లో చేర్చారు పోలీసులు.