బడ్జెట్ ప్రకటనలకు సంబంధించి 11 వెబ్‌నార్లలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వీటి ద్వారా పథకాలను ప్రారంభించడానికి, బడ్జెట్‌లో పేర్కొన్న హామీలను అమలు చేయడానికి వీలు కలగనుంది. 

DIPAM బడ్జెట్ ప్రకటనల గురించి చర్చించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం వెబ్‌నార్‌లో ప్రసంగించారు. దీంతో ప్రధాని ప్రసంగించిన 11 బడ్జెట్ సంబంధిత వెబ్‌నార్ల శ్రేణి ముగిసినట్లయ్యింది. ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రక్షణ, ఆరోగ్యం, DPIIT, PSA, MNRE, DEA , DIPAM మంత్రిత్వ శాఖలు/విభాగాలకు సంబంధించిన బడ్జెట్ వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. బడ్జెట్-2022 దేశ ఆర్థిక వృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం అనేక హామీలు ఇచ్చింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బడ్జెట్ అమలులో వాటాదారులందరికీ యాజమాన్య భావాన్ని సృష్టించే లక్ష్యంతో ఈ వెబినార్లు నిర్వహించబడ్డాయి. స్మార్ట్ వ్యవసాయం, PM గతిశక్తి, రక్షణ, డిజిటల్ విద్య, ఆత్మనిర్భర్ భారత్ వంటి విభిన్న రకాల అంశాలను వెబినార్లలో కవర్ చేశారు . అలాగే డైనమిక్ స్కిల్లింగ్, ఆరోగ్య సంరక్షణ, మేక్ ఇన్ ఇండియా, ఫైనాన్సింగ్ మొదలైన అంశాలకు సంబంధించి ప్రధాని సహా ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

ఈ తరహా కసరత్తు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే మంత్రిత్వ శాఖలు/ విభాగాలు రంగంలోకి దిగేందుకు , అమలు కాలపరిమితి నిర్ధారించడానికి కూడా సహాయపడుతుంది. వివిధ వాటాదారులతో సంప్రదింపులు వారి ఆచరణాత్మక / ప్రపంచ నైపుణ్యం , అనుభవాన్ని తీసుకోవడం వల్ల లోపాలను గుర్తించడంలో సహాయపడుతుంది. బడ్జెట్‌ని ఫిబ్రవరి 1కి మార్చడం, వెబ్‌నార్‌లలో ఈ పరస్పర చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతలను పొందేలా చేస్తాయి. తద్వారా వారి బడ్జెట్‌లను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

వ్యాపారవేత్తలు, MSMEలు, ఎగుమతిదారులు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, స్టార్టప్‌లకు చెందిన యువత తదితరులు సహా దాదాపు 40 వేలమంది ఈ వెబ్‌నార్‌లలో పాల్గొన్నారు. ప్రతి వెబ్‌నార్ సమయంలో సమగ్ర ప్యానెల్ చర్చలు, థీమ్-ఆధారిత బ్రేక్-అవుట్ సెషన్‌లు నిర్వహించబడ్డాయి. ఈ వెబ్‌నార్ల సమయంలో ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో విలువైన సూచనలు అందాయి. ఇవి బడ్జెట్ హామీలను సమర్థవంతంగా అమలు చేయడంలో మరింత సహాయపడతాయి.