త్వరలో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన.. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం..
INDIA- UAE Relationship: ప్రధాని మోడీ ఈ నెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా అబుదాబిలో నిర్మించిన తొలి ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య పలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
![PM Modi UAE Visit,India-UAE bilateral relationship in last one year,India-UAE bilateral relationship KRJ PM Modi UAE Visit,India-UAE bilateral relationship in last one year,India-UAE bilateral relationship KRJ](https://static-ai.asianetnews.com/images/01hpf55jkz2y6ve2bwqjg7z4jt/asianet-news---2024-02-12t224712-577_363x203xt.jpg)
INDIA- UAE Relationship: భారత్ వేసే దౌత్యపరమైన చర్యలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాలతోనే కాదు. అరబ్ దేశాలతో కూడా భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇలా దౌత్య విధానంలో ప్రపంచ దేశాలకు భారత్ ఓ మార్గదర్శిగా నిలుస్తోంది. తాజాగా ప్రధాని మోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోడీ భేటీ అవుతారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర అభిప్రాయాలు విస్తరించేలా వీరి మధ్య చర్చలు జరుగుతాయి. అలాగే.. అబుధాబీలో మొట్టమొదటి హిందూ ఆలయం BAPS మందిర్ను ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. అనంతరం యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ను కూడా మోడీ కలుసుకుంటారు. కాగా.. మోడీ 2015లో ప్రధాని అయిన తరువాత యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. ఈ తరుణంలో భారత్ యూఏఈ మధ్య సత్సంబంధాలపై మీరూ లూక్కేయండి.
రాజకీయ సంబంధాలు
నరేంద్ర మోడీ ప్రధానిగా అధికారం చేపట్టిన నాటి నుంచి యూఏఈ- భారత్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. ఈ గతేడాది కాలంగా ఇరుదేశాల మధ్య 5 ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి. జులై 2023లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం ప్రధాని యూఏఈలో పర్యటించారు. అబుదాబి వేదికగా జరిగిన ఈ ద్వైపాక్షిక భేటీలో యూఏఈ అధ్యక్షుడు హెచ్హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్తో పలు కీలక అంశాలను చర్చించారు.
దుబాయ్లో జరిగిన COP28కి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ 30 నవంబర్ నుంచి 01 డిసెంబర్ 2023 వరకు UAE పర్యటించారు. ఈ ప్రత్యేక భేటీలో ప్రధాని మోడీ .. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో భేటీ అయ్యారు. అలాగే.. UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ సెప్టెంబర్ 2023 లో G20 లీడర్స్ సమ్మిట్లో పాల్గొనడానికి భారత్ సందర్శించారు. IMEEC, గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయన్స్ సంయుక్త ప్రారంభంలో పాల్గొన్నారు.
2024 జనవరిలో జరిగిన 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ను సందర్శించారు. నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక జీ 20 G20 సమావేశానికి త్యేక ఆహ్వానితుడిగా ఈయూఏని ఆహ్వానించారు. అలాగే.. ఫిబ్రవరి 2023లో విదేశాంగ మంత్రి, యుఎఇ, ఫ్రెంచ్ సహచరుల మధ్య టెలికాన్ఫరెన్స్ సందర్భంగా భారతదేశం-యుఎఇ-ఫ్రాన్స్ (యుఎఫ్ఐ) త్రైపాక్షిక అధికారికంగా ప్రారంభించబడింది. అలాగే.. భారత్ క్రియాశీల మద్దతుతో UAE 01 జనవరి 2024న BRICSలో సభ్యత్వం పొందింది.
వాణిజ్యం - పెట్టుబడి
ఇరు దేశాల మధ్య వాణిజ్యం -పెట్టుబడులు పెరిగాయి. 30 ఏప్రిల్ 2023 నాటికి CEPA అమలులోకి వచ్చి ఏడాది అవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 16% వృద్ధి చెంది USD 85 మిలియన్లకు చేరుకుంటుంది. FY 2022-23లో $3.5 బిలియన్ల విలువైన పెట్టుబడులతో భారత్ కు యూఏఈ.. నాల్గవ అతిపెద్ద వనరుగా నిలిచింది. అలాగే.. జూలై 15, 2023న ప్రధాని మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
సరిహద్దు లావాదేవీల కోసం భారతీయ కరెన్సీ మరియు దిర్హామ్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇరుదేశాల మధ్య స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ వ్యవస్థను స్థాపించబడింది. బంగారం, పెట్రోలియం, ఆహార వస్తువులతో కూడిన మూడు ప్రధాన లావాదేవీలు జరిగాయి. ఇరుదేశాల మధ్య చెల్లింపు, సందేశ వ్యవస్థలను పరస్పరం అనుసంధానించడంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారత్ రూపే స్టాక్ ఆధారంగా UAE జాతీయ డెబిట్/క్రెడిట్ కార్డ్ సిస్టమ్ "జయ్వాన్"ను అభివృద్ధి చేయడానికి NPCI సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ UAE ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది.
జైవాన్ కార్డ్ సాఫ్ట్ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో పూర్తి లాంచ్ జరగనుంది. జనవరి 2024లో UAE అధ్యక్షుడు HH షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ను సందర్శించారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్కు వచ్చిన యూఏఈ అధ్యక్షుడు పలు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ UAE మార్చి 2023లో డిజిటల్ కరెన్సీలపై అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దాదాపు US$300 మిలియన్ల పెట్టుబడితో గుజరాత్లో హైబ్రిడ్ ఎనర్జీ పార్క్ ఏర్పాటుపై చర్చ. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో 2023 మార్చిలో శ్రీనగర్లో మొదటి ఇండియా-యుఎఇ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది.
జమ్మూ కాశ్మీర్లో UAE నుండి మొదటి ఎఫ్డిఐ ప్రకటించబడింది. EMAAR గ్రూప్ శ్రీనగర్ శివార్లలో ఒక షాపింగ్ మాల్, మల్టీపర్పస్ టవర్లో రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మార్చి 2023లో ADIA లెంక్స్టార్ట్లో US$500 మిలియన్లను పెట్టుబడి పెట్టింది. మే 2023లో ముపడాల క్యూబ్ హైవేస్లో US$300 మిలియన్లను పెట్టుబడి పెట్టింది.
దీర్ఘకాలిక ఒప్పందం
ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య సహకారం ముఖ్యమైనది. 2026-39 నుండి 14 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం కింద 1.2 MMT LNG కొనుగోలు కోసం IOCL- ADNOC మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే.. భారత్- యూఏఈ మధ్య మొదటి దీర్ఘకాలిక LNG ఒప్పందం జరిగింది. భారతదేశంతో దీర్ఘకాల LNG ఒప్పందాన్ని కలిగి ఉన్న ప్రాంతంలో UAE రెండవ దేశంగా నిలిచింది.
జనవరి 2024లో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) గెయిల్ ఇండియాకు సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMTPA) ఎల్ఎన్జిని సరఫరా చేయడానికి 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది.
సహకారం , పెట్టుబడిని ప్రోత్సహించడానికి జనవరి 2023లో ఓ ఎంఓయు సంతకంపై చేయబడింది.
అలాగే.. 15 జూలై 2023న ప్రధాని మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా IIT ఢిల్లీ – అబుదాబి, UAE ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
IIT-T, అబుదాబి తాత్కాలిక క్యాంపస్ రికార్డు సమయంలో మొదటి పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సుతో ముందుకు వచ్చింది.
రక్షణ శాఖ
జనవరి 2024లో భారతదేశం-యుఎఇ మధ్య తొలి ద్వైపాక్షిక సైనిక విన్యాసం రాజస్థాన్లో జరిగింది. జనవరి 2024లో భారత్- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ వైమానిక దళాలు తొలి త్రైపాక్షిక వ్యాయామంలో పాల్గొన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ దఫ్రా ఎయిర్ బేస్లో జరిగింది.
యుఎఇ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సమక్షంలో గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ను ప్రధాని ప్రారంభించారు. భారత్- UAE, ఇతర దేశాలతో పాటు, భారతదేశం-మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEEC) , గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ను సెప్టెంబర్ 2023లో G20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రారంభించాయి.
COP26 గ్లాస్గోలో UAE- US ప్రారంభించిన AIM ఫర్ క్లైమేట్ ఇనిషియేటివ్ (AIM4C) 2023లో భారత్ కు చేరింది. 30 నవంబర్ నుంచి 01 డిసెంబర్ వరకు ప్రధాని దుబాయ్ పర్యటన సందర్భంగా యుఎఇ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సమక్షంలో గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ను ప్రధాని ప్రారంభించారు.