ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోంది. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా నిర్మించబోతున్న నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంకుస్థాపన చేయనున్నారు.
న్యూ ఢిల్లీ : ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోంది. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా నిర్మించబోతున్న నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంకుస్థాపన చేయనున్నారు.
కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి (జాతీయ పక్షి) ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం (జాతీయ పుష్పం) రూపంలో ఉండనున్నాయి.
జాతీయ వృక్షమైన మర్రి చెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలవనుంది. శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తొలుత భావించింది. సెంట్రల్ విస్టా నిర్మాణంపై కేసు నడుస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నారు. మోదీతోపాటు దాదాపు 200 మంది అతిథులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ దేశాల రాయబారులు ఉండనున్నారు. కొంతమంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
నూతన భవన స్వరూపమిదీ
లోక్సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజల కోసం 480 సీట్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
లోక్సభలో ప్రస్తుతం సభ్యులు కూర్చొనే సీటు పొడవు, వెడల్పుల నిష్పత్తి 45,40గా ఉండగా, కొత్త దాంట్లో అది 60,40గా ఉండనుంది.
ప్రస్తుతం తొలి రెండు వరుసల్లో కూర్చున్నవారికి తప్ప మిగతావారికి డెస్క్లు లేవు. కొత్త భవనంలో అందరికీ ఆ సౌకర్యం కల్పిస్తారు.
ప్రస్తుత భవనంలో అనలాగ్ మైక్లు ఉండగా, కొత్త దాంట్లో ప్రతి ఎంపీకీ ఒక టచ్ స్క్రీన్తో కూడిన డిజిటల్ సిస్టమ్ను ఏర్పాటుచేయనున్నారు.
ప్రస్తుత సెంట్రల్ హాల్ 670 చదరపు మీటర్లలో ఉండగా కొత్త దాంట్లో లోక్సభే సెంట్రల్ హాల్గా ఉంటుంది. అది 1,315 చదరపు మీటర్లలో వస్తుంది.
సెంట్రల్ లాంజ్ / కోర్టు యార్డులో జాతీయ వృక్షం మర్రిచెట్టును యథాతథంగా ఉంచుతారు.
మంత్రుల కార్యాలయాలు లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో 20, గ్రౌండ్ ఫ్లోర్లో 18, మొదటి అంతస్తులో 26, రెండో అంతస్తులో 28 ఉంటాయి.
లోక్సభను ఆనుకొనే ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది.
కాన్స్టిట్యూషన్ హాలు ఎత్తు 20 మీటర్లు. దానిపై అశోక స్థూపాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ హాలులోనే రాజ్యాంగాన్ని ప్రదర్శనకు ఉంచుతారు.
ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనానికీ చుట్టూ నిలువెత్తు రాతిస్తంభాలు వస్తాయి.
సభ్యులు వేసే ఓటు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా నూతన భవనంలో 281 అంగుళాల వీడియో వాల్ను ఏర్పాటుచేస్తారు.
గ్యాలరీల్లో కూర్చొనే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా 165 అంగుళాల తెరలను నెలకొల్పుతారు.
వీవీఐపీల కోసం 2 గేట్లు, ఎంపీల వాహనాలు రావడానికి 2 గేట్లు, సాధారణ ప్రజలు, సిబ్బంది, మీడియా, సందర్శకుల కోసం 2 గేట్లు కేటాయిస్తారు.
అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు.
కొత్త భవనంలో ఉండే విభాగాలు
లోక్సభ
రాజ్యసభ
సెంట్రల్ హాలు
సెంట్రల్ లాంజ్ / కోర్ట్ యార్డ్
గ్రంథాలయం
డైనింగ్ హాల్
మంత్రుల కార్యాలయాలు
ప్రధానమంత్రి కార్యాలయం
కమిటీ హాళ్లు
లాంజ్
మరుగుదొడ్లు
కాన్స్టిట్యూషన్ హాల్
సెక్యూరిటీ, రిసెప్షన్ భవనం
ప్రెస్ లాంజ్, సావనీర్ షాప్
పాత పార్లమెంటు, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణాలు (చదరపు మీటర్లు)
మొత్తం నిర్మాణ ప్రాంతం 47,443 64,500
బేస్మెంట్ / లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ 8,000 13,675
గ్రౌండ్ ఫ్లోర్ 16,540 20,320
మొదటి అంతస్తు 13,248 16,680
రెండో అంతస్తు 2,877 8,100
మూడో అంతస్తు 4,463
గేట్లు (సంఖ్య) 12, 6
లోక్సభలో సీట్లు 552, 888
రాజ్యసభలో సీట్లు 245 ,384
సెంట్రల్ హాల్లో సీట్లు 436, 1,272
మంత్రుల కార్యాలయాలు 37, 92
కమిటీ హాళ్లు 3, 6
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 10, 2020, 10:20 AM IST