Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ- చెన్నై మార్గాల్లో వందేభారత్‌ రైళ్లు.. వచ్చే వారమే ప్రారంభం..

విజయవాడ-చెన్నైల మధ్య, హైదరాబాద్-బెంగళూరుల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారు అయింది.

PM Modi Flagged Off Hyderabad Bengaluru and Vijayawada chennai Vande Bharat Trains in Next Week ksm
Author
First Published Sep 21, 2023, 11:37 AM IST

హైదరాబాద్: విజయవాడ-చెన్నైల మధ్య, హైదరాబాద్-బెంగళూరుల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారు అయింది. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్‌గాప్రారంభించారు. ఆ జాబితాలో కాచిగూడ(హైదరాబాద్)- యశ్వంతపూర్(బెంగళూరు), విజయవాడ-చెన్నై వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. 

సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారని.. మరుసటి రోజు(సెప్టెంబర్ 25) నుంచి ఈ రైలు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు నగరాల మధ్య దూరాన్ని 609 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది.

రైలు నెంబర్ 20703 కాచిగూడ - యశ్వంత్‌పూర్.. కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.  తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 20704 యశ్వంత్‌పూర్ - కాచిగూడ.. యశ్వంత్‌పూర్ నుంచి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 11:15 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. ఈ వందేభారత్ రైలుకు.. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌లలో స్టాప్‌లు ఉండనున్నాయి. 

మరోవైపు విజయవాడ-చెన్నై వందేభారత్ రైలును కూడా ప్రధాని మోదీ ఈ నెల 24న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) అధికారులు బుధవారం తెలిపారు.

ఇక, ఈ రైలు మంగళవారం మినహా వారంలో అన్ని రోజులు నడపబడుతుంది. విజయవాడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి..రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకుంటారు. ఈ వందేభారత్ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో స్టాప్‌లుఉన్నాయి. రైల్వే అధికారుల ప్రకారం.. కొత్త వందే భారత్ రైళ్లలో ప్రయాణీకుల మెరుగైన సౌకర్యాల కోసం అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios