దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..  

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆయన నిశబ్దమే సమాధానం:

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని బీజేపీ ఇంకా జీర్ణించుకోవడం లేదు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, ప్రతిపక్షానికి ‘అధిక మాసం’ అని పేరుపెడతామని మాజీ సీఎం బసవరాజు బొమ్మైకి కేంద్రహోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు చెప్పారు.

కానీ, సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కేంద్రమంత్రివర్గం ప్రక్షాళన మరికొన్ని రోజుల్లో జరుగుతుందని ఢిల్లీవర్గాలు చెప్పాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి, ప్రతిపక్ష నేత ఎంపిక, కర్ణాటక బీజేపీ కోర్ కమిటీ ఏర్పాటు కూడా ఈ ప్రక్షాళనతోపాటే జరుగుతాయని వివరించాయి.

ఇదంతా ఓకే.. కానీ, ఎప్పుడు ఇవి జరుగుతాయని మీరు అడిగారనుకోండి.. దీనికి సింపుల్ సమాధానం ‘అంతా మోడీకే తెలుసు’. 

ఆఫ్ ది రికార్డ్‌గా కొందరు సీనియర్ నేతలు ఏం చెబుతున్నారంటే.. కర్ణాటకలో పరాజయంపై ప్రధాని ఇప్పటికీ కినుకతోనే ఉన్నారు. స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పటికీ తనకు ఎవరూ ఆ అంచనాలను చెప్పలేదు. కర్ణాటక కోసం తాను వేసుకున్న ప్లాన్‌లు అన్నీ గంగలో కలిశాయని ప్రధాని బాధలో ఉన్నారు. అందుకే పై ప్రకటనల కోసం ప్రధాని మౌనం దాల్చారు.

యాక్షన్ గట్టిగా ఉంటుంది..

కర్ణాటక ఓటమిని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్తాన్, తెలంగాణ, మిజోరం ఎన్నికల్లో పార్టీ వ్యూహాలకు ప్రధాని ఉపయోగించుకుంటున్నారు. ఇటీవలే ఈ రాష్ట్రాల నేతలతో ప్రధాని మూడు గంటలపాటు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రొజెక్ట్ చేయాలని, ఛత్తీస్‌గడ్‌లోనైతే సంఘటిత నాయకత్వ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, రాజస్తాన్ బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ వసుంధర రాజేతో ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ ముందస్తుగా సీఎంను ప్రకటించకపోవచ్చు.

ఛత్తీస్‌గడ్, ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లోనూ బీజేపీ ఆందోళనలో ఉన్నది. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ లెక్కన రాజస్తాన్ వారికి బెటర్‌గా కనిపిస్తున్నది. అయితే, అన్ని రకాల నిర్ణయాలను ఎన్నికల దగ్గరపడే వరకు గోప్యంగానే ఉంచవచ్చు.

కామ్రేడ్ సావర్కర్:

వినాయక్ దామోదర్ సావర్కర్ ఒక తీవ్రమైన వామపక్ష సాహసి!! ఎల్‌డీఎఫ్ నేత ఈపీ జయరాజన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రేక్షకులు ఖంగుతిన్నారు. ‘సావర్కర్ ఒక తీవ్ర వామపక్ష భావజాలాన్ని అనుసరించారు. ఈ ఆదర్శాలను శోషిస్తున్న బ్రిటీష్ పై సావర్కర్ పోరాడి అండమాన్ జైలుపాలయ్యాడు. ఆయనకు తెలుసు ఆయన ఏమి ఎదుర్కోబోతున్నారో...’ అంటూ ఈపీ జయరాజన్ ఎవరూ కనని, వినని చరిత్రను చెప్పే ప్రయత్నం చేశారు.

‘సావర్కర్ జైలులో మగ్గుతున్న కాలంలో హిందూ మహా సభ ఆయన వద్దకు వెళ్లింది. బ్రిటీష్ వాళ్లకు రాతపూర్వక క్షమాపణ చెప్పాలని కోరింది. సావర్కర్ ఈ సూచనను ఆచరించి బెయిల్ పొందాడు’ అని ఈపీ ఓ లెక్చర్ ఇచ్చారు. చరిత్రకు ఇలాంటి కొత్త విశ్లేషణలు ఇవ్వడం ఈపీకి కొత్త విషయమేమీ కాదు. చాలా సార్లు ఆయన వాస్తవాలను తప్పుగా చిత్రించారు. చాలా సార్లు అబాసుపాలైనా ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం సాగిస్తూనే ఉన్నారు.

కేసీఆర్ వర్సెస్ కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ షార్ట్ ఫామ్‌ల రొద పెరిగింది. నాగర్జున సాగర్ పై కన్నేసిన అల్లు అర్జున్ మామ కే చంద్రశేఖర్ రెడ్డి(కేసీఆర్) ఇటీవలే సామాజిక సేవ కోసం కేసీఆర్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికే అనే చర్చ మొదలైంది.

తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ఖరారు చేస్తున్న సమయంలో మరో కేసీఆర్ (కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి) ఈ ఓపెనింగ్ చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రీపోల్ సర్వేల ఆధారంగా సాగర్‌లో కొత్త అభ్యర్థిని దించాలనే యోచన చేస్తున్నాడని వార్తలు వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం గమనార్హం.

నాగర్జున సాగర్‌ స్థానంలో 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య గెలిచారు. ఆయన మరణంతో వచ్చిన ఉపఎన్నికలో కొడుకు నోముల భగత్ గెలిచారు. అయితే.. ఈ సారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది. ఈ సందర్బంలో అల్లు అర్జున్ స్టార్‌డమ్ ఉపయోగించుకుని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అందరి కళ్లు తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. నల్గొండలో కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించి ఈ ప్రయత్నం చేశారు. దీనికి కేసీఆర్ అని పేరు పెట్టడం కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టి పడటానికే అని తెలుస్తున్నది.

సొంతపార్టీలోనే తిరుగుబాటు?

ఆ మంత్రికి రాజస్తాన్‌ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉన్నదని, ఆయన పేరు చెబితే చాలు పనులు జరిగిపోతాయని చెబుతుంటారు. ఆ మంత్రి కూడా తన పొజిషన్, పవర్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. గర్వడుతుంటారు. కానీ, ఇది ఒక విషయంలో తారుమారైంది. సొంతపార్టీ మనుషులే హేళన చేసేలా మారిపోయింది.

ట్రైన్‌లో కాల్పులు జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు అందిస్తానని ఆ మంత్రి ప్రకటించారు. కానీ, రూ. 50 లక్షలు చెల్లించాలని పార్టీ మనుషులు పట్టుబట్టారు. ఈ నిరసనను పలుచన చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ అవమానాన్ని ఆ మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ప్రాంతం నుంచి సదరు మనిషి ఒక కొత్త పాఠం నేర్చుకుని వెనుదిరిగారు. లేక ఆత్మవివేచన చేసుకున్నాడా? అది ఆయన కర్మనేనా?