ఆపరేషన్ సింధూర్, భారత్-పాక్ ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ తర్వాత, భారత్-పాక్ ఘర్షణ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మన ఆడపిల్లల సింధూరాన్ని చెరిపిన ఉగ్రవాదులను మనం భూమి మీద నుంచి తుడిచిపెట్టేశాం. భయపడిన పాకిస్తాన్ ప్రపంచం మొత్తం దేశాలను ఆశ్రయించింది అని ప్రధాని అన్నారు.

1. పాక్‌ ని మూడు రోజుల్లో కాళ్ల బేరానికి వచ్చేలా చేశాం
2.న్యూక్లియర్ వార్‌ పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తే ఏం చేయాలో తెలుసు
3.ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్‌ తోకజాడిస్తే..అంతం చేస్తాం
4.శాంతి -ఉగ్రవాదం,నీళ్లు-నెత్తురు ఒక్కచోట ఉండలేవు
5. ఉగ్రవాదం ఉన్నంత వరకూ పాక్‌ తో శాంతి చర్చలు లేవు
6.పాక్‌ తో చర్చలంటూ ఉంటే పీఓకే పై మాత్రమే
7. యుద్ధం మా ప్రాధాన్యత కాదు,అలాగని ఉగ్రవాదాన్ని సహించం
8. తోక జాడిస్తే మేడిన్ ఇండియా అస్త్రాలు ప్రయోగిస్తాం
9.పహల్గాంలో ఉగ్రవాదుల పిరికి చర్యకు జవాబిచ్చాం
10.మనది దొంగదెబ్బ కాదు,పాక్‌ గుండెల మీద కొట్టాం.