సానియా మీర్జాతో గడిపేందుకు సమయం దొరకట్లేదు - పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్
సానియా మీర్జాతో విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బ్రేకులు వేశారు. తాము ఇద్దరం బాగానే ఉన్నామని స్పష్టం చేశారు. ఇద్దరికి సమయం దొరక్కపోవడం వల్ల కలవడం కుదరడం లేదని అన్నారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తన భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న పుకార్లపై ఆయన మౌనం వీడారు. తాము ఇద్దరం కలిసే ఉన్నామని, అయితే ఆమెతో కలిసి గడిపేందుకు సమయం దొరకడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ జంట ఈద్ పండుగను కలిసి జరుపుకోకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారు అనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మరో యవతితో వివాహం.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు.. పురుషుడి వేశంలో వచ్చి మరీ దాడి..
సోయబ్ మాలిక్ జియో న్యూస్ ప్రోగ్రామ్ ‘స్కోర్’తో మాట్లాడుతూ.. ఈద్ పండగ రోజు తాము ఇద్దరం కలిసి గడిపి ఉంటే బాగుండేదని అన్నారు. అయితే ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ వల్ల ఒకరికొకరం దూరంగా ఉండాల్సి వస్తోందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సానియా కొన్ని షోలు చేస్తోందని షోయబ్ పేర్కొన్నారు. తమ ఇద్దరిలో ఎవరికి టైమ్ దొరికినా కలిసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఆమెను చాలా మిస్ అవుతున్నానని అన్నారు.
అకాల వర్షాలు.. తెలంగాణ సరిహద్దుల్లో పిడుగు పడి నలుగురి మృతి
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా అబద్దమని కొట్టిపారేశారు. తాము ఇద్దరం బాగానే ఉన్నామని చెప్పారు. తాము ప్రస్తుతం దూరంగా ఉన్నా ఎప్పటిలాగే ప్రేమను పంచుకుంటామని తెలిపారు. భారతదేశం- పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగవ్వాలని తాను ఆశిస్తున్నానని సోయబ్ బాలిక్ అన్నారు. ఇరుదేశాల క్రికెట్ అభిమానులే కాదు.. అనేక దేశాల అభిమానాలు కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని తపనపడుతుంటారని తెలిపారు.
కాగా.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ లు 2010లో వివాహం చేసుకున్నారు. 2018లో ఈ దంపతులకు ఓ కుమారుడు (ఇజాన్) జన్మించాడు. సోషల్ మీడియాలో సానియా మీర్జా పోస్టులు, ఇద్దరూ దూరంగా ఉంటుండటంతో కొంత కాలంగా విడాకుల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ తో టెన్నిస్ కు వీడ్కోలు పలికిన సానియా.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు మెంటార్ గా నియమితులయ్యారు.