పీఓకేలో మిరాజ్ను వెంటాడిన పాక్ ఎఫ్ 16...కానీ
పీఓకేలో పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్కు దిగిన సంగతి తెలిసిందే. దాడి విషయంపై స్పందించిన పాక్ ఆర్మీ.. భారత యుద్ధ విమానాలు పీఓకేలోకి ప్రవేశించాయని ధ్రువీకరించింది.
పీఓకేలో పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్కు దిగిన సంగతి తెలిసిందే. దాడి విషయంపై స్పందించిన పాక్ ఆర్మీ.. భారత యుద్ధ విమానాలు పీఓకేలోకి ప్రవేశించాయని ధ్రువీకరించింది.
అయితే భారత విమానాలను పాక్ ఫైటర్ జెట్లు వెంటాడాయని ఆ దేశ సైనికాధికారి ఒకరు తెలిపారు. అయితే అందులో కొంత నిజం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పీఓకేలోకి ప్రవేశించిన భారత యుద్ధవిమానాలను పాక్ తన ఎఫ్ 16 ఫైటర్లతో వెంటాడింది.
అయతే మిరాజ్ సత్తాను చూసి పాక్ తోకముడిచిందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఎఫ్ 16 విమానాలు ప్రతిదాడికి దిగినప్పటికీ.. మిరాజ్-2000 విమానాలను ఎదుర్కోలేక అవి వెనక్కి వెళ్లిపోయాయి.
భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ
పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?
సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే
పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్ఫోర్స్
సర్జికల్స్ స్ట్రైక్స్-2కు మిరాజ్-2000నే ఎందుకు వాడారంటే..?