రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రధాని మోడీ , ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కనిపించకుండా పోతారంటూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ .. విపక్షాలను టార్గెట్ చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కనిపించకుండా పోతారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదద్దున్ ఒవైసీ ఎదురుదాడికి దిగారు. పార్లమెంట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్టుగా కాకుండా తమ పార్టీ ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తుందని ఒవైసీ అన్నారు. 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు విషయాన్ని ప్రస్తావించారు.
ఓవైసీ మాట్లాడుతూ.."మేము హర్యానాకు వెళ్లి ముఖ్యమంత్రి కుర్చీ కోసం మోడీ ఆశీర్వాదంతో దాక్కోలేదు. నాకు యూ-టర్న్లు అస్సలు అలవాటు లేదు. చింతించకండి, నేను రాజస్థాన్ వస్తూనే ఉంటాను. జునైద్-నసీర్ హత్యలు ఎన్నికల అంశం కాదు. న్యాయానికి సంబంధించిన ప్రశ్న’’ అని" అని అన్నారు.
పైలట్ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ.. "నాకు యూ-టర్న్లు అస్సలు అలవాటు లేదు. చింతించకండి, నేను రాజస్థాన్కు వస్తూనే ఉంటాను. ఈ రోజుల్లో టోంక్ ప్రజలు తమ ఎమ్మెల్యేను ఎందుకు చూడలేకపోతున్నారు?" ప్రశ్నించారు.
ఇక జునైద్-నసీర్ హంతకులకు మద్దతుగా రాజస్థాన్ రాష్ట్రంలో మహాపంచాయత్లు తీర్మానాలు చేయడాన్ని ఓవైసీ గుర్తు చేశారు. బాధితులకు కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందని, హంతకులకు స్వేచ్ఛనిచ్చిందని విమర్శించారు. "జునైద్-నసీర్ హత్య ఎన్నికల సమస్య కాదు, న్యాయానికి సంబంధించిన ప్రశ్న.
జునైద్, నసీర్ హంతకులకు మద్దతుగా మహాపంచాయత్లను మనం చూశాము, కానీ హత్యను ఖండించడం లేదా నిరసించడం చిన్న సభ కూడా చూడలేదు. ఆవు టెర్రర్ను ఏ పేరుతో చేస్తున్నారు, ఆ సమాజం ఉగ్రవాదాన్ని స్పష్టంగా ఖండించాలి కదా? అని ఓవైసీ ప్రశ్నించారు.
సోమవారం నాడు శ్రీగంగానగర్ జిల్లాలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో సచిన్ పైలట్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా రాజస్థాన్లో ప్రధాని మోడీ మరియు ఒవైసీ కనిపించడం లేదని, ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర పర్యటన ప్రారంభించారని అన్నారు. ‘ఈ ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ప్రధాని దౌసాకు... ఒవైసీ టోంక్కు వెళ్తున్నారు.. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం.. ఈ ఇద్దరు నేతలు గత నాలుగేళ్లుగా ఎక్కడ ఉన్నారు..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారు ప్రసంగాలు చేయడానికి, మతం గురించి మాట్లాడటానికి వస్తున్నారు. వారు ఎన్నికలకు ముందు అక్కడ లేరు మరియు రాజస్థాన్లో ఎన్నికలు ముగిసిన రోజు, వారు అదృశ్యమవుతారు." అని కీలక వ్యాఖ్యలయ్యారు. ‘‘ఇక్కడ ఎల్లప్పుడు ఉంటే మేం సుఖ దుఃఖంలో మీకు తోడుగా ఉంటాం.. రైతులపై చట్టాలు తెచ్చిన వాళ్లం.. మతం పేరుతో ఓట్లు వేసి అధికారంలోకి వచ్చిన వాళ్లం.. అధికారంలో ఉన్నా అదుపు చేయలేకపోయారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం,” అని టోంక్ ఎమ్మెల్యే అన్నార.
