Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: 1.47 ల‌క్ష‌ల మంది పిల్లల్ని అనాథ‌ల్ని చేసిన కరోనా !

Coronavirus: క‌రోనా వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి ల‌క్ష‌లాది మంది ప్రాణాలను బ‌లి తీసుకుంది. కోట్లాది మందిని ఆస్ప‌త్రిపాలు చేసింది. పిల్ల‌ల‌పై క‌రోనా మ‌హ‌మ్మారి చూపిన ప్ర‌భావం అంతాఇంతా కాదు. దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయారు. 
 

Over 1.47 lakh children lost their parents due to COVID and other reasons since April 2020: NCPCR to SC
Author
Hyderabad, First Published Jan 16, 2022, 5:56 PM IST

Coronavirus: పిల్ల‌ల‌పై క‌రోనా మ‌హ‌మ్మారి చూపిన ప్ర‌భావం అంతాఇంతా కాదు. దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయారు. ఈ విష‌యాల‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ( NCPCR ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. COVID-19, సంబంధిత ఇతర కారణాల వల్ల 2020  ఏప్రిల్ 1 నుండి మొత్తం 1,47,492 మంది పిల్లలు తమ తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయారని  NCPCR వెల్ల‌డించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల సంరక్షణ, రక్షణ అవసరమయ్యే పిల్లలపై స్వయంప్రతిపత్తిలో వివరాలను అందజేస్తూ.. NCPCR తన బాల్ స్వరాజ్ పోర్టల్ లో  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్‌లోడ్ చేసిన డేటా ఆధారంగా తమ గణాంకాలు ఉన్నాయని తెలిపింది.  ఈ వివ‌రాలు జ‌న‌వ‌రి 11వ‌ర‌కు అప్‌డేట్ చేయ‌బ‌డిన‌వి ఉన్నాయి. 

“రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా 'బాల్ స్వరాజ్ పోర్టల్-కోవిడ్ కేర్'లో అప్‌లోడ్ చేయబడిన పిల్లల డేటా.. రెండు వర్గాల పిల్లలను కలిగి ఉంటుందని తెలిపింది. ఇందులో కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులలో ఇద్దరినీ లేదా ఒకరిని కోల్పోయార‌ని వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు అందిన వివ‌రాల ప్ర‌కారం.. క‌రోనా కార‌ణంగా 10,094 మంది పిల్ల‌లు అనాథలు  అయ్యారు.  త‌ల్లిదండ్రుల్లో ఒక‌రు లేదా ఇద్ద‌రు కోల్పోయిన పిల్ల‌లు 1,36,910 మంది ఉన్నారు. క‌రోనా కార‌ణంగా త‌ల్లిదండ్రుల దూరం అయిన వారిలో 488 మంది పిల్ల‌లు ఉన్నారు. ఇలా మొత్తంగా  చిన్నారులు క‌రోనా కార‌ణంగా త‌ల్లిదండ్రుల్లో ఇద్ద‌రు  లేదా ఒక‌రిని కోల్పోవ‌డం.. పూర్తి సంర‌క్ష‌ణ లేకుండా అవ‌డం, త‌ల్లిదండ్రులకు దూరం అయిన చిన్నారుల సంఖ్య మొత్తం 1,47,492 చేరుకుంది. వీరిని లింగాల వారీగా విభ‌జిస్తే.. 1,47,492 మంది పిల్లలలో 76,508 మంది బాలురు, 70,980 మంది బాలికలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని National Commission for Protection of Child Rights (NCPCR) తెలిపింది.

వ‌య‌స్సుల వారీ గ‌ణాంకాలు గ‌మ‌నిస్తే.. ఎనిమిది నుంచి 13 ఏళ్ల మధ్య 59,010 మంది, 14 నుంచి 15 ఏళ్లలోపు వారు 22,763 మంది ఉన్నారు. అలాగే, 16 నుంచి 18 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌లు 22,626 మంది ఉన్నారు. నాలుగు నుంచి ఏడేండ్ల‌లోపు పిల్ల‌లు 26,080 మంది ఉన్నారు. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన వారిలో 1,25,205 మంది త‌ల్లిదండ్రుల్లో ఒక‌రిని క‌లిగి వారి సంర‌క్ష‌ణ‌లో ఉన్నారు. 11,272 మంది పిల్లలు కుటుంబ సభ్యులతో, 8,450 మంది సంరక్షకులతో ఉన్నారు. 1,529 మంది చిన్నారులు బాలల గృహాల్లో, 19 మంది ఓపెన్ షెల్టర్ హోమ్‌ల్లో, ఇద్దరు అబ్జర్వేషన్ హోమ్‌ల్లో, 188 మంది అనాథ శరణాలయాల్లో, 66 మంది ప్రత్యేక దత్తత ఏజెన్సీల్లో, 39 మంది హాస్టళ్లలో ఉన్నారని NCPCR పేర్కొంది. 

క‌రోనా కార‌ణంగా త‌ల్లిదండ్రుల్లో ఒక‌రు లేదా ఇద్ద‌రిని కోల్పోయిన పిల్ల‌ల వివ‌రాల‌ను రాష్ట్రాల వారీగా గ‌మ‌నిస్తే.. అత్యధిక సంఖ్యలో ఒడిశా (24,405), మహారాష్ట్ర (19,623), గుజరాత్ (14,770), తమిళనాడు (11,014), ఉత్తరప్రదేశ్ (9,247), ఆంధ్రప్రదేశ్ (8,760)లో ఉన్నారని కమిషన్ తెలిపింది. ఆ త‌ర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ (7,340), పశ్చిమ బెంగాల్ (6,835) ఢిల్లీ (6,629) మరియు రాజస్థాన్ (6,827)లు ఉన్నాయి. పిల్లలు మహమ్మారి బారిన పడకుండా, వారి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కమిషన్ తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios