Asianet News TeluguAsianet News Telugu

బెంగుళూరులో ప్రారంభమైన విపక్షాల సమావేశం: సీఎంపీపై సబ్ కమిటీ సహా పలు అంశాలపై చర్చ

బెంగుళూరులో విపక్ష పార్టీల సమావేశం  సోమవారంనాడు రాత్రి ప్రారంభమైంది.  ఈ సమావేశానికి  26 పార్టీలు హాజరయ్యారు.

Opposition Meeting  begins in Bengaluru lns
Author
First Published Jul 17, 2023, 8:41 PM IST


బెంగుళూరు: విపక్ష పార్టీల  సమావేశం  సోమవారంనాడు రాత్రి బెంగుళూరులోని ఓ హోటల్ లో  ప్రారంభమైంది.  ఈ సమావేశానికి 26 పార్టీల నుండి  53 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల  20వ తేదీ నుండి ప్రారంభం కానున్న  పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు  2024 ఎన్నికల్లో  ఎంపీ సీట్ల కేటాయింపు, ఉమ్మడి  ఐక్య కార్యాచరణ  విషయమై చర్చించనున్నారు.  అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో  ఎన్నికల సభల నిర్వహణపై చర్చిస్తారు. 

ఈ సమావేశానికి  హాజరైన విపక్ష పార్టీల నేతలకు కర్ణాటక సీఎం  సిద్దరామయ్య  విందు ఇవ్వనున్నారు. పాట్నాలో జరిగిన గత సమావేశానికి  కొనసాగింపుగా  బెంగుళూరు  సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం నిర్వహణ కోసం  సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని  విపక్ష పార్టీలు భావిస్తున్నాయి.  ఈ కూటమికి ఏ పేరు పెట్టాలనే దానిపై  కూడ చర్చించనున్నారు. 

2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించాలనే లక్ష్యంతో   ఈ కూటమి  సమావేశం సాగుతుంది.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ విజయం విపక్ష పార్టీల్లో  జోష్ ను నింపింది.  విపక్ష పార్టీల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం  వహించింది. రేపటి వరకు  ఈ సమావేశం జరగనుంది.

also read:విపక్ష పార్టీల భేటీ: బెంగుళూరుకు చేరుకున్న సోనియా, రాహుల్

ఇదిలా ఉంటే రేపు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం  ఐదు గంటలకు  ఈ సమావేశం ప్రారంభం కానుంది.  ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios