Operation Kaveri: సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 'ఆపరేషన్ కావేరి'. సూడాన్ సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్ 24న ప్రభుత్వం దీనిని ప్రకటించింది. తరలింపు సరైన ప్రక్రియను అనుసరించేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత వైమానిక దళం, సూడాన్ లోని భారత రాయబార కార్యాలయంతో సహా అధికారుల బృందాన్ని నియమించింది.
Operation Kaveri: అల్లర్లతో అతలాకుతలమైన సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించే మిషన్ 'ఆపరేషన్ కావేరి' కింద 365 మందిని భారత్ శనివారం స్వదేశానికి తీసుకొచ్చింది. ఇప్పటికే రెండు బ్యాచ్ లలో సూడాన్ నుంచి భారతీయులను ప్రభుత్వం తీసుకువచ్చింది. తాజాగా మరో బ్యాచ్ లో 365 మందిని భారతీయులను స్వదేశానికి తీసకువచ్చినట్టు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. 'OperationKaveri కింద ఎక్కువ మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. 365 మంది ప్రయాణికులు న్యూఢిల్లీ చేరుకున్నారు' అని మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు.
సూడన్ నుంచి ఇప్పటికే ప్రత్యేక మిషన్ కింద రెండు బ్యాచ్ లలో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. రెండు బ్యాచ్ లలో మొత్తం 754 మందిని భారత్ కు చేరుకున్న మరుసటి రోజే మరో బ్యాచ్ లో 365 మంది దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. దీంతో సూడాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల సంఖ్య 1,725కి చేరింది. సౌదీ అరేబియా నగరమైన జెడ్డా నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు, అక్కడ నిర్వాసితుల కోసం భారత్ ట్రాన్సిట్ క్యాంపును ఏర్పాటు చేసింది. తొలి విడత 360 మంది నిర్వాసితులు బుధవారం వాణిజ్య విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఐఏఎఫ్ కు చెందిన సీ17 గ్లోబ్ మాస్టర్ విమానంలో 246 మంది భారతీయుల రెండో బ్యాచ్ గురువారం దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చేరుకుంది.
ఆపరేషన్ కావేరి కింద, భారతదేశం తన పౌరులను ఖార్తూమ్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల నుండి బస్సుల్లో పోర్ట్ సూడాన్ కు తరలిస్తోంది. అక్కడ నుండి భారత వైమానిక దళానికి చెందిన హెవీ-లిఫ్ట్ రవాణా విమానం, భారత నావికాదళం నౌకలలో సౌదీ అరేబియా నగరం జెడ్డాకు తీసుకువెళుతోంది. జెడ్డా నుంచి భారతీయులను కమర్షియల్ ఫ్లైట్ లేదా ఐఏఎఫ్ విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తున్నారు. జెడ్డా, పోర్ట్ సూడాన్ లలో భారత్ ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసిందని, ఢిల్లీలోని ఎంఈఏ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరపడంతో పాటు ఖార్తూమ్ లోని భారత రాయబార కార్యాలయం వారితో సమన్వయం చేసుకుంటోందని అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, సూడాన్ లో ఆ దేశ సైన్యానికి, పారామిలటరీ బృందానికి మధ్య జరుగుతున్న పోరులో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు మరింతగా దిగజారుతుండటంతో సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ప్రకటించారు. తరలింపు సరైన ప్రక్రియను అనుసరించేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత వైమానిక దళం, సూడాన్ లోని భారత రాయబార కార్యాలయంతో సహా అధికారుల బృందాన్ని నియమించింది. తరలింపు సమయంలో భారతీయులను సూడాన్ నుంచి రాజధాని నగరం ఖార్టూమ్ కు తరలించి, అక్కడి నుంచి భారత్ కు తీసుకువస్తున్నారు.
