సారాంశం


కేరళ రాష్ట్రంలో ఇవాళ జరిగిన  బాంబు పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కాలమస్సేరిలో  ఆదివారంనాడు  బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.  ఎర్నాకుళంలో జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో  ఈ పేలుడు చోటు చేసుకుంది.  ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో  20 మంది గాయపడ్డారు క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది. వరుసగా మూడు దఫాలు  ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయని  ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

యెహూవా సాక్షి సమావేశంలో మూడు దఫాలు బాంబు పేలుళ్లు జరిగినట్టుగా  సమాచారం.యెహూవా సాక్షి సమావేశం పేరుతో శుక్రవారం నుండి ఆదివారం వరకు  సమావేశాలు నిర్వహిస్తారు.ఈ సమావేశాలు జరిగే ప్రాంతంలో  పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఉగ్రదాడిగా  కూడ పోలీసులు అనుమానిస్తున్నారు. 

పేలుళ్లు జరిగిన సమయంలో ఈ కన్వెన్షన్ సెంటర్ లో  2 వేల మంది ఉన్నారు.  ఈ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మూడు పేలుళ్లతో  ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.  మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో  ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.  క్షతగాత్రులను  స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుళ్లపై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనతో  సెలవుల్లో ఉన్న వైద్యులను వెంటనే  విధుల్లో చేరాలని  కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఆదేశించారు.  క్షతగాత్రులకు  మెరుగైన వైద్యం అందించాలని  కాలమెసిరి  మెడికల్ కాలేజీ సిబ్బందిని  ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు.

కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన   పేలుడు ఘటనపై  దర్యాప్తు నిర్వహిస్తున్నట్టుగా కేరళ సీఎం  పినరయి విజయన్ ప్రకటించారు.  ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆయన  ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని సీఎం తెలిపారు.  మొత్తం  36 మంది ఆసుపత్రిలో చేరారు. అయితే వీరిలో  10 మందికి 50 శాతానికి పైగా  కాలిన గాయాలున్నాయని  ఆసుపత్రి సిబ్బంది ప్రకటించారు.