భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర పెట్టలేదని..
తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. భోజనానికి పిలిచి తనకు కోడిగుడ్డు కూర పెట్టలేదని స్నేహితుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త వివాదానికి దారి తీసింది.
భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర పెట్టలేదని ఓ వ్యక్తి ప్రాణ స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని మంకాపూర్కు చెందిన బనార్సీ అనే వ్యక్తి శనివారం రాత్రి తన ఫ్రెండ్ గౌరవ్ గైక్వాడ్ను భోజనానికి పిలిచాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. భోజనానికి పిలిచి తనకు కోడిగుడ్డు కూర పెట్టలేదని స్నేహితుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త వివాదానికి దారి తీసింది.
ఈ క్రమంలో గౌరవ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఇనుపరాడ్డుతో బనార్సీ తలపై కొట్టాడు. దీంతో బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హంతకుడు గౌరవ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.