Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ దోషుల మరో ఎత్తుగడ: ఢిల్లీ లెఫ్టినెంట్‌‌ను ఆశ్రయించిన వినయ్ శర్మ

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఈ క్రమంలో నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మరో ఎత్తుగడ వేశాడు

Nirbhaya convict approaches Dehli L G seeks to commute death sentence
Author
New Delhi, First Published Mar 9, 2020, 10:17 PM IST

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఈ క్రమంలో నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మరో ఎత్తుగడ వేశాడు. తన శిక్షను తగ్గించాలంటూ ఢిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.

తన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. జైల్లో ఉన్న సమయంలో తనలో వచ్చిన మార్పు, తన వయసు, తన కుటుంబ సామాజిక ఆర్ధిక పరిస్ధితులను పరిగణనలోనికి తీసుకుని శిక్షను తగ్గించాలని వేడుకున్నాడు. 

Also Read:నిర్భయదోషులను ఉరితీయడానికి మరోసారి "ముహూర్తం" ఫిక్స్... కొత్త డెత్ వారెంట్ జారీ

నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష తేదీలు ఖరారయ్యాయి. నలుగురు దోషులకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఉరిశిక్షకు అమలకు సంబంధించి కొత్త డెత్ వారెంట్లు ఇచ్చింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. 

ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరితీయాలి. అయితే ఈ నలుగురు మరణశిక్ష అమలు జాప్యం జరిగేలా ఒక్కొక్కరుగా తమకున్న న్యాయపరమైన అవకాశాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఈ జాప్యంపై నిర్భయ తల్లిదండ్రులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈసారైనా నలుగురిని ఉరితీయాలని వారు కోరారు. 

నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ పిటిషన్‌ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది.సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును, మెడికల్ స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రపతి కోవింద్ తన మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించారని నిర్భయ దోషి వినయ్ శర్మ  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

నియమ నిబంధనల ప్రకారంగానే వినయ్ శర్మ మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించినట్టుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.దీంతో వినయ్ శర్మ  తన మెర్సీ పిటిషన్‌ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను  రద్దు చేసింది. 

Also Read:నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు: నిర్భయ తల్లీ ఏమన్నారంటే

సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును, మెడికల్ స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించారని నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ కోర్టుకు చెప్పుకున్నాడు. వినయ్ శర్మ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో వాదిస్తూ గురువారం వాదించారు.

వినయ్ ను శారీరకంగా హింసించిన చరిత్ర ఉందని, చాలా సార్లు వినయ్ ను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకుని వెళ్లారని, పిటిషనర్ మెంటల్ కండీషన్ బాగా లేదని, అంతులేని వేదనను అనుభవించాడని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios