నిర్భయ కేసు: దోషులకు కొత్త డెత్ వారంట్, ఉరి తీసేదీ ఆ రోజే
నిర్భయ దోషులకు ఈ నెల 20 వ తేదీన ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఈ నెల 20 వ తేదీన ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే మూడు దఫాలు ఈ దోషులకు ఉరి వాయిదా పడింది. జనవరి 22, ఫిబ్రవరి 1, మార్చి 3వ తేదీన ఉరి తీయాలని డెత్ వారంట్లు జారీ అయ్యాయి. కానీ దోషులు తమకు ఉన్న అన్ని రకాల న్యాయ అంశాలను వినియోగించుకొన్నారు.
Also read:నిర్భయ కేసు: అప్షన్లన్నీ ఖతమ్, దోషులకు ఉరి ఎప్పుడంటే....
దీంతో మూడు దఫాలు డెత్ వారంట్లు ఇచ్చినా కూడ ఉరిశిక్షను అమలు చేయలేదు. తాజాగా ఈ కేసులో దోషి పవన్ గుప్తా ఈ నెల 2వ తేదీన దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.అదే రోజున రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేశారు.
పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను ఈ నెల 4వ తేదీన రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. దీంతో తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టులో కొత్త డెత్ వారంట్ కోసం ఈ నెల 4 వతేదీన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై కోర్టు విచారించింది. గురువారం నాడు కొత్త డెత్ వారంట్ ను జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 20వ తేదీన ఉదయం 5:30 గంటలకు ఈ నలుగురిని ఉరి తీయాలని కోర్టు కొత్త డెత్ వారంట్ జారీ చేసింది.