నిర్భయ కేసు: రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన అక్షయ్ కుమార్ , తప్పుకొన్న సీజే
నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్ కుమార్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం నాడు ఈ కేసు నుండి చీఫ్ జస్టిస్ బాబ్డే తప్పుకొన్నారు.
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై విచారణ నుండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే తప్పుకొన్నారు. కొత్త బెంచీ ఈ రివ్యూ పిటిషన్ను దాఖలు చేయనున్నారు.
Also read:నిర్భయ దోషులను నేనే ఉరితీస్తా... రక్తంతో మహిళ లేఖ
నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్ కుమార్ తనకు విధించిన కేసును సమీక్షించాలని సుప్రీంకోర్టులో అక్షయ్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టును స్వీకరించింది. నిర్భయపై గ్యాంగ్ రేప్, హత్య కేసుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు ఈ కేసును వాదిస్తోంది.
దీంతో ఈ కేసు విచారణ చేసే ధర్మాసనం నుండి చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే తప్పుకొన్నారు. ఈ కేసును మరో ధర్మాసనం విచారణ చేయనుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ప్రకటించారు. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు రేపు విచారణ చేయనుంది.
మరోవైపు నిర్భయపై గ్యాంగ్ రేప్ జరిగి హత్య జరిగి ఈ నెల 16వ తేదీ నాటికి ఏడేళ్లు అవుతోంది. నిందితులకు ఉరిశిక్ష పడినప్పటికీ కూడ వారికి ఇంకా ఉరిశిక్ష తీయాలనే డిమాండ్ తీవ్రమైంది. తీస్హాజరి జైలు వద్ద మహిళా సంఘాలు ఈ నెల 16వ తేదీన నిర్భయ నిందితులను తమకు అప్పగిస్తే ఉరి తీస్తామని చెప్పారు.