01:15 PM (IST) May 28

బానిస ఆలోచనలు వదిలిన భారత్ కు ప్రతీకగా నూతన పార్లమెంట్ : ప్రధాని మోదీ

బానిస ఆలోచనలను వదిలి భారత్ ప్రాచీన కాలంలోని గౌరవం వైపు నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నూతన భవనం అందుకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఈ భవనం చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నారని అన్నారు. లోక్ సభ రాష్ట్రీయ పక్షి నెమలిని పోలీవుంది. రాజ్యసభ కమలం మాదిరిగా వుందని ప్రధాని తెలిపారు. 

01:04 PM (IST) May 28

సెంగోల్ గొప్పతనాన్ని వివరించిన ప్రధాని

సెంగోల్ గొప్పతనాన్ని వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్ సభలో సెంగోల్ ప్రతిష్టించడం గొప్ప విషయం... ఇది మన అదృష్టమని అన్నారు. సెంగోల్ ప్రతిష్టను తెలియజేయాలని అనుకున్నాం. 

01:02 PM (IST) May 28

భారత్ ముందుకు వెళితేనే ప్రపంచం ముందుకు..: ప్రధాని

ఈ రోజు ప్రపంచం మొత్తం భారత సంకల్పంపై నమ్మకంగా చూస్తున్నారు. భారత్ ముందుకు వెళితేనే ప్రపంచమూ ముందుకు వెళుతుందని ప్రధాని మోదీ అన్నారు. 

12:59 PM (IST) May 28

పార్లమెంట్ భవనం ఆకాంక్షలు, కలల ప్రతిబింబం : ప్రధాని మోదీ

ఇది కేవలం పార్లమెంట్ భవనం కాదు దేశ ప్రజలు ఆకాంక్షలు, కలల ప్రతిబింబం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 
 

12:41 PM (IST) May 28

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించిన అధికారులు

నూతర పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు అధికారులు. అంతకుముందు నూతన పార్లమెంట్ నిర్మాణం, సెంగోల్ చరిత్రను తెలిపే వీడియోను ప్రదర్శించారు. 

12:15 PM (IST) May 28

రెజ్లర్ల పార్లమెంట్ మార్చ్... అడ్డుకుని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది

నూతన పార్లమెంట్ భవనం వైపు దూసుకెళుతున్న రెజ్లర్లను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పార్లమెంట్ మార్చ్ పేరిట రెజ్లర్లు ఆందోళనకు పిలుపునివ్వగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికి పార్లమెంట్ వైపు వెళుతున్న రెజ్లర్లను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.   

12:06 PM (IST) May 28

అతిథులతో నిండిన నూతన పార్లమెంట్... తిరిగి చేరుకున్న ప్రధాని

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అతిథులంతా ఇప్పటికే పార్లమెంట్ కు చేరుకున్నారు. 

08:48 AM (IST) May 28

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం... తదుపరి కార్యక్రమాల షెడ్యూల్ ఇదే

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పూజలు ముగిసాయి. ఉదయమే పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని ప్రస్తుతం తిరిగి వెళ్లిపోయారు. మళ్లీ 11.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నారు.  

11.30 AM: అతిథులు, ప్రముఖుల రాక.

12.00 PM: ప్రధాని నరేంద్ర మోదీ రాక. జాతీయ గీతాలాపనతో వేడుక ప్రారంభమవుతుంది.

12.10 PM: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ , రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ ప్రసంగం.

12.17 PM: రెండు లఘు చిత్రాల ప్రదర్శన.

12.38 PM: రాజ్యసభలో ప్రతిపక్ష నేత ప్రసంగం (హాజరయ్యే అవకాశం లేదు). లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం.

1.05 PM: రూ. 75 నాణెం , స్మారక స్టాంపును ప్రధానమంత్రి విడుదల చేస్తారు.

1.10 PM: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.

2.00 PM: వేడుక ముగుస్తుంది.

08:24 AM (IST) May 28

స్పీకర్ కుర్చీ పక్కనే సెంగోల్ ప్రతిష్టించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనంలోని లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్ ను ప్రతిష్టించారు. అనంతరం స్పీకర్ ఓంబిర్లాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసారు. 

08:09 AM (IST) May 28

పార్లమెంట్ ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి.  అన్ని మతాలకు చెందిన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.  

07:37 AM (IST) May 28

పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ

నూతన పార్లమెంట్ భవన ప్రాంగణంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ పాల్గొన్నారు. 

07:32 AM (IST) May 28

నూతన పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా జరిగే పూజా కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. 

07:15 AM (IST) May 28

నూతన పార్లమెంట్ లో ప్రధాని పూజలు

భారత నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్దమయ్యింది. మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. నూతన పార్లమెంట్ భవన మండపాల్లో పూజలు నిర్వహించనున్నారు.