ఈ విద్యా సంవత్సరం నుండి ఏడాదికి రెండు సార్లు నీట్ ప్రవేశపరీక్షలను నిర్వహిించనున్నట్టు కేంద్ర హెచ్ఆర్‌డి మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.అయితే రెండు దఫాల్లో ఏదైనా ఒక్కసారి మాత్రమే ఒక్క అభ్యర్ధి పరీక్ష రాసే అవకాశం ఉంటుందని ఆయన ప్రకటించారు.

న్యూఢిల్లీ: నీట్, జేఈఈ ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాదిలో రెండు సార్లు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే తమ వెసులుబాటును బట్టి విద్యార్ధులు ఈ పరీక్షలు రాసుకోవచ్చని ఆయన ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

శనివారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ విద్యాసంవత్సరం నుండే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తమ వెసులుబాటును బట్టి విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరు కావొచ్చని ఆయన చెప్పారు. అయితే ఏడాదిలో రెండు దఫాలు ప్రవేశపరీక్షలు జరిగినా... ఒక విద్యార్ధి ఒకే సారి మాత్రమే పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ఈ ఏడాది డిసెంబర్ లో జేఈఈ నిర్వహించనున్నట్టు చెప్పారు. జేఈఈ మెయిన్స్ ను జనవరి మాసంలో నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. నీట్ ను ఈ విద్యాసంవత్సరం నుండి రెండు దఫాలు నిర్వహించాలని భావిస్తున్నందున ఫిబ్రవరి , మే మాసాల్లో నిర్వహించాలని భావిస్తున్నారు.అయితే ఈ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ప్రశ్నల ఫార్మాట్, భాష, ఫీజు విధానంలో ఎలాంటి మార్పులు లేవని ఆయన ప్రకటించారు.