నేడు మేఘాలయ, త్రిపురల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం.. !
New Delhi: రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు (ఆదివారం) మేఘాలయ, త్రిపురల్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా షిల్లాంగ్ లో జరిగే నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (ఎన్ఈసీ) స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. 1972 నవంబరు 7న ఈ మండలిని అధికారికంగా ఏర్పాటు చేశారు.
PM Narendra Modi to visit Meghalaya, Tripura: నేడు (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోడీ ఈశాన్య భారత రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మేఘాలయ, త్రిపుర పర్యటనలో రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే, తన పర్యటనలో భాగంగా షిల్లాంగ్ లో జరిగే నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (ఎన్ఈసీ) స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. 1972 నవంబరు 7న ఈ మండలిని అధికారికంగా ఏర్పాటు చేశారు.
వివరాల్లోకెళ్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుల్లో హౌసింగ్, రోడ్లు, వ్యవసాయం, టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టూరిజం, హాస్పిటాలిటీ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొంటారని, షిల్లాంగ్లో జరిగే సమావేశంలో పాల్గొంటారని పీఎంవో తెలిపింది. అగర్తలాలో, 'ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ అండ్ రూరల్' కింద రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారుల కోసం 'గృహ ప్రవేశ్' కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించనున్నారు.
నార్త్-ఈస్ట్ కౌన్సిల్ (NEC) నవంబర్ 7, 1972న అధికారికంగా ప్రారంభించబడిందనీ, వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు-అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతం సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించిందని పీఎంవో తెలిపింది.
ప్రజలకు సహాయం చేయడానికి ప్రధాని మోదీ కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు సహాయపడే కొత్త మార్గాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ ఆలోచిస్తారని అన్నారు. 'ప్రధాన్ మంత్రి గతి శక్తి'పై ఈశాన్య ప్రాంతీయ సదస్సు ప్రారంభోత్సవంలో సాహా మాట్లాడుతూ.. "సున్నా మొత్తంతో బ్యాంక్ ఖాతా తెరవడం లేదా స్వచ్ఛ్ భారత్ అభియాన్ లేదా ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం వంటివి ప్రజలకు సహాయపడే అసాధారణమైన-వినూత్న మార్గాల గురించి మన ప్రధాని ఎలా ఆలోచించగలరని నేను ఆశ్చర్యపోతున్నాను" అని ఆయన అన్నారు.
అలాగే, "మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్ధారించడానికి 'యాక్ట్ ఈస్ట్' విధానంపై తీవ్రంగా కృషి చేస్తోంది. అత్యుత్తమ విమానాశ్రయాలలో ఒకటి త్రిపురలో ప్రారంభించబడింది. అలాగే, ఈశాన్య రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ప్రోత్సహించింది. రూ.10,222 కోట్లు ఇందుకోసం కొత్తగా ఏడు జాతీయ రహదారులను మంజూరు చేసిందని" తెలిపారు. త్రిపుర పరిశ్రమల మంత్రి సనాతన్ చక్మా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి లోకరంజన్, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల అధికారులు- సైన్యం, భారత వైమానిక దళానికి చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొని నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్పి)పై చర్చించారు.