చలితో వణికిపోతున్న ఉత్తరభారతం.. దక్షిణాదిలోనూ పెరుగుతున్న చలిగాలులు
New Delhi: ఉత్తర భారతదేశంలో శీతాకాలం ప్రారంభమైంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణాదిలోనూ చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ.. చలి తీవ్రత పెరుగుతోంది.
Rising cold in the country: భారతదేశంలో శీతాకాలం ప్రారంభమైంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో చలిగాలులు క్రమంగా పెరుగుతున్నాయి. పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణాదిలోనూ చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ.. చలి తీవ్రత పెరుగుతోంది. చలి ఎక్కువవుతోంది.అదే సమయంలో కొండ ప్రాంతాల్లోనూ మంచు కురుస్తోంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండగా.. రాబోయే మూడు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో దట్టమైన పొగమంచు ఉంటుందని భారత వాతావారణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
డిసెంబర్ 4 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 5 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి డిసెంబర్ 7 ఉదయం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
గత 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రత 8-10 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైందనీ, మధ్య భారతదేశంలో సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల గురించి చెప్పాలంటే, కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు నుండి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉంది. తమిళనాడు, అండమాన్ నికోబార్, కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
అండమాన్ నికోబార్లో డిసెంబర్ 5న భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు, చలికి సంబంధించిన సూచన గురించి మాట్లాడుతూ, రాబోయే ఐదు రోజులలో దేశంలోని ఉత్తర ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండబోదని తెలిపింది. మహారాష్ట్రలో రానున్న మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుంది. అదే సమయంలో, హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో, రాబోయే మూడు రోజులలో ఉదయం చాలా దట్టమైన పొగమంచు ఉంటుంది.
దేశంలోని మైదాన ప్రాంతాల్లో ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కాగా, తెల్లవారుజామున పొగమంచు వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, దేశంలోని అనేక ప్రాంతాలు రాబోయే కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలో తగ్గుదలని ఉంటుందని అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అండమాన్ నికోబార్ ద్వీపాలు తేలికపాటి నుండి మోస్తరు వర్షం చూడవచ్చు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన కేటగిరీలో ఉంటుందని ఐఎండీ తెలిపింది.