కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదు: ఎన్సీపీ అధినేత శరద్ పవార్
Mumbai: పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పూణేలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించారు. 1999లో గ్రాండ్ ఓల్డ్ పార్టీని విడిచిపెట్టిన తర్వాత ఆయన కాంగ్రస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.
NCP supremo Sharad Pawar: దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. శరద్ పవార్ బుధవారం పూణేలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించారు. 1999లో గ్రాండ్ ఓల్డ్ పార్టీని విడిచిపెట్టిన తర్వాత ఆయన కాంగ్రస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. అంటే దాదాపు 23 ఏండ్ల తర్వాత ఆయన ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకుండా భారతదేశం ఉండదనీ, దాని భావజాలం, సహకారాన్ని విస్మరించలేమని ఆయన అన్నారు.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి శరద్ పవార్ కాంగ్రెస్ భవన్ ను సందర్శించారు. కొందరు కాంగ్రెస్ ముక్త్ భారత్ ను డిమాండ్ చేస్తున్నారనీ, కానీ దేశాన్ని కాంగ్రెస్ రహిత దేశంగా మార్చలేమనీ, అది సాధ్యం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్, ఈ దేశం, ప్రజల మధ్య ఒక ప్రత్యేక బంధం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విధానాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతానని పవార్ తెలిపారు. కాంగ్రెస్ లో తన ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్న శరద్ పవార్, గ్రాండ్ ఓల్డ్ పార్టీ యువ కార్యకర్తగా తన వృత్తిని ప్రారంభించిన పవార్ 1958 లో మొదటిసారి భవన్ ను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. 1999లో పార్టీని వీడి సొంత పార్టీని స్థాపించినప్పటికీ, ఆ తర్వాత తన మాజీ పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపి ముందుకు నడిచారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పూణేలోని కాంగ్రెస్ భవన్ పార్టీ కేంద్ర బిందువుగా ఉంది. మహారాష్ట్ర పరిపాలన ఈ భవనం నుండి పనిచేసింది. ఇక్కడి నుంచి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇందిరా గాంధీ ద్వారా ఒప్పించి, ముంబై రాజధానిగా మహారాష్ట్రను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రస్తుత పాలన దర్యాప్తు సంస్థల అధికార దుర్వినియోగంను నిర్వచిస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ మనీలాండరింగ్ కేసులో ఏడాదికుపైగా జైలు శిక్ష అనుభవించారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టు, ఆ తర్వాత విడుదల చేసిన ఉదాహరణను పవార్ ఉదహరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండటానికి ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తానని పవార్ చెప్పారు.
అలాగే, పూణేలో జరిగిన శంభాజీ బ్రిగేడ్ సిల్వర్ జూబ్లీ సదస్సులో కూడా ఆయన పాల్గొన్నారు. శంభాజీ బ్రిగేడ్ ప్రారంభమై 25 సంవత్సరాలు అయింది. మేము దాని రజతోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.