Asianet News TeluguAsianet News Telugu

దుబాయ్ లో ఖరీధైన విల్లా కొనుగోలు చేసిన ముఖేష్ అంబానీ.. చిన్నకొడుకు కోసమట.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయి...

దుబాయ్ లో ముఖేష్ అంబానీ దంపతులు ఓ ఖరీధైన విల్లా కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.640 కోట్లతో కొన్న ఈ విల్లా.. చిన్న కొడుకు అనంత్ కోసం అని సమాచారం. 

Mukesh Ambanis Reliance Industries buys Dubais costliest home ever
Author
First Published Aug 29, 2022, 12:59 PM IST

ముంబై : భారత అపరకుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ విదేశాల్లో మరో లగ్జరీ కొనుగోలు చేశారట. అరబ్ నగరం దుబాయ్ లోని సముద్రతీరంలో 80మిలియన్ డాలర్లతో అంటే దాదాపు భారత కరెన్సీలో రూ. 640 కోట్లు.. తో కొనుగోలు చేసినట్లు బ్లూమ్ బర్గ్ కథనం వెల్లడించింది. దుబాయ్ లో ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది. దుబాయ్ లోని palm jumeirahలో ఉన్న ఈ విల్లాను ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ ఏడాది ఆరంభంలోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.  

అయితే ప్రైవేటు డీల్ కావడంతో దీన్ని అత్యంత గోప్యంగా ఉంచినట్లు బ్లూమ్ బర్గ్ కథనం పేర్కొంది. దుబాయ్ స్థానిక కథనాల్లో కూడా అంబానీ పేరు వెల్లడించకుండా భారత బిలియనీర్ అని పేర్కొన్నారు. రిలయన్స్ ఆఫ్ షోర్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటి ఈ డీల్ ను రహస్యంగా జరిపినట్లు తెలుస్తోంది. ఈ విల్లాను తమకు అనుగుణంగా మార్చుకోవడంతోపాటు, భద్రత కోసం కోట్లు అంబానీలు కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. చెట్టు ఆకారంలో ఉండే ఈ పామ్ జుమైరా..  దుబాయ్ లో కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయం.  

సహజీవనం.. స్వలింగ సంపర్కుల రూపంలోనూ కుటుంబ సంబంధాలు : సుప్రీంకోర్టు

ఈ ప్రాంతంలోనే ఓ బీచ్ సైడ్ లగ్జరీ విల్లాను అంబానీ కొనుగోలు చేశారట. ఇందులో పది పడకగదులు, ప్రైవేట్ స్పా, ఇండోర్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఈ విల్లాకు సమీపంలోనే బ్రిటిష్ ఫుట్బాల్ ఆటగాడు డేవిడ్ బెక్ హామ్, బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కూడా నివాసాలు కూడా ఉన్నాయి. కాగా, గతేడాది ముఖేష్ అంబానీ బ్రిటన్లో ఓ విశాల సౌధాన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. లండన్ లో బకింగ్ హాంషైర్ దగ్గర ఉన్న మూడు వందల ఎకరాల్లోని ‘స్టోక్ పార్క్’ను రూ. 592 కోట్లతో కొనుగోలు చేశారు. దీన్ని పెద్ద కుమారుడు ఆకాష్ కోసం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  

మిస్ దివా యూనివర్స్ 2022 : కిరీటాన్ని దక్కించుకున్న కర్ణాటక సుందరి దివితా రాయ్...

తాజాగా చిన్న కుమారుడు అనంత్ కోసం దుబాయ్ లో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. ఇక కుమార్తె ఈశా అంబానీ కోసం న్యూయార్క్లో ఇల్లు వెతుకుతున్నట్లు సమాచారం.  65 ఏళ్ల ముకేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.  ఇటీవలే ఆకాశ్ ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కు చైర్మన్ గా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుటుంబం ముంబై లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో నిర్మించిన ఆకాశహర్మ్యం ‘యాంటిలియా’లో నివాసం ఉంటోంది.  27 అంతస్తుల ఈ భవనంలో 3 హెలిప్యాడ్ లో, 168 కార్ల కోసం పార్కింగ్, 50 మంది కూర్చుని చూసే సినిమా థియేటర్, 9ఎలివేటర్లు  ఇతర అధునాతన సదుపాయాలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios