అమరవీరుల కుటుంబాన్ని ఆదుకున్న ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్
2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే.
26/11 ముంబయి దాడులు జరిగి నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో పాక్ ఉగ్రవాదులతో పోరాడి కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. పాక్ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు వదిలిన భారత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కుటుంబాన్ని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఆదుకున్నారు. ఈ ఘటనపై ముందుగా స్పందించి ఆయన తన ఉదారత చాటుకున్నారు. ‘ బ్రేవ్ హార్ట్’ అనే ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.25లక్షలు విరాళంగా ఇచ్చారు.
@rajeev_mp hs alwys shown his comitmnt 4 our BraveHearts n ther families
— Shreya Raj (@ShreyaRaj_) November 26, 2018
1st beneficiary of @FlagsOfHonour, a @rajeev_mp initiative, ws lt. Maj. #Unnikrishnan's family. Funds of 25L ws used to set up a trust in the #Braveheart's namehttps://t.co/NVDjVkE5Kc
కాగా.. ఈ దాడులు జరిగి పదేళ్లు అయిన సందర్భంగా ఎంపీ చంద్రశేఖర్ చేసిన సహాయాన్ని ఓ మహిళ ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు.