Mother Language Day : అన్య భాషలను ఎన్నో నేర్చినప్పటికీ తల్లి భాష లేనిదే ఏ వ్యక్తి గొప్ప వాడు కాలేదు. మాతృభాషతోనే మానవ వికాసం అన్నది జగమెరిగిన సత్యం. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తల్లిభాష పూర్తిగా మరుగున పడే ప్రమాదంలో ఉంది. ఉద్యోగాల పేరిట, అభివృద్ధి పేరిట తల్లిభాషనే మర్చిపోతున్నారు. ఇది దేనికీ పనికి రాదు అనే ధోరణితో ప్రవర్తిస్తున్నారు.   

 

Mother Language Day : తల్లి భాష లేనిదే మనం లేము. విధ్యా బుద్దులు, నీతి, నిజాయితీ అన్నీ మనకు నేర్పింది తల్లిభాషే. ఈ తల్లిభాషతోనే మనం లోకానికి పరిచయమయ్యాం. అది శబ్దాల ద్వారా కావొచ్చు లేదా సంజ్ఞల రూపంలో కావొచ్చు. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి ఇలాగే పెరిగింది. ఈ భాష లేనిదే మనం లేమన్నది జగమెరిగిన సత్యం. ఒక వ్యక్తి గొప్ప వాడవ్వడానికి కారణం అతని పట్టుదలో లేక ఇతర భాషలపై ఉన్న పట్టో అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ముందుగా ఉండాల్సింది తల్లిభాషపై పట్టు. కానీ నేడు అదే తల్లిభాష విలవిలాడుతోంది. దు:ఖంతో మూలుగుతోంది. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ దానిమీదున్న మోజుతో తల్లి భాషను మర్చిపోతే.. అది ఉనికినే మాయం చేస్తుంది.  

అభివృద్ధి అని, ఉద్యోగాలని నేడు ఎంతో మంది తల్లి భాషను పూర్తిగా విస్మరిస్తున్నారు. తల్లిభాష కూడా ఒకటుందా అనే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడున్న దుస్థితి మునుపెన్నడూ లేనిది. పరాయి భాషమీద మోజుతో తల్లిభాషనే మర్చిపోతున్నారు. అందులోనూ ఈ భాషతో మనకు ఒరిగేదీ ఏదీ లేదని పూర్తిగా పరాయి భాషనే ప్రోత్సహిస్తున్నారు ఎంతో మంది నేటి తల్లిదండ్రులు. ఇలాంటి ఆలోచనా ధోరణి కారణంగానే నేడు ఎన్నో మాతృభాషలు కనుమరుగైనాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ అనే రోడ్ రోలర్ కింద పడి ఎన్నో తల్లిభాషలు అంతరించి పోయే స్థితికి చేరుకున్నాయి. 

2022 ఏడాది థీమ్ ఏంటో తెలుసా.. ‘బహుభాషా అభ్యాసానికి సాంకేతికతను ఉపయోగించడం. అలాగే సవాళ్లు, అవకాశాలు’. అందరికీ మెరుగైన, నాణ్యమైన విధ్యను భోధించడానికి, బహుభాషా విధ్య అభివృద్ధి కోసం పాటు పడటం. ప్రతి ఏడాది ఫిబ్రవరి 21 నాడు అంతర్జాతీయ  మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజును తల్లిభాషా దినోత్సవంగా జరుపుకోవడాని చాలా కారణాలే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషలు, సాంస్కృతి సంప్రదాయాలు, బహు భాషావాదాన్ని ప్రోత్సహించడానికే ఈ రోజును జరుకుంటాం. ఈ భాష కేవలం మన కమ్యూనికేషన్ కోసమే కాదు.. చరిత్ర పుట్టు పూర్వోత్తరాలను వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి చేరేవేసే సాధనం కూడా.

కానీ నేడు ఎన్నో తల్లిభాషలు అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది. ముఖ్యంగా ప్రతి రెండు వారాలకు ఒక భాషను కోల్పోతున్నామని చెబుతోంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే 6000 లాంగ్వేజ్ లల్లో 43 శాతం భాషలు అంతరించి పోయే స్టేజ్ లో ఉన్నాయని పేర్కొంటోంది. 

ఇకపోతే ఇండియాలో 270 మాతృభాషలు ఉంటే.. రాజ్యంగంలో అధికారికంగా 121 భాషలు పేర్కొనబడ్డాయి. వీటిని భారత రాజ్యాంగంలో 8 వ షెడ్యూల్ 22 part a లో పేర్కొన్నారు. మిగిలినవి 99 పార్ట్ బిలో పేర్కొనబడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. భారతదేశంలో ఎక్కువ ప్రజాధారణ పొందిన భాషగా హిందీ కొనసాగుతోంది. మన దేశంలో 52 కోట్ల మందికి హిందీనే మాతృభాష. 

తల్లి భాషను కాపాడుకోవడానికి 30 వ యునెస్కో మహాసభ 1999  ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ  మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ఈ తల్లిభాషా రోజును జరుపుకోవడానికి కారణం బంగ్లాదేష్. వారి మథర్ లాంగ్వేజ్ బెంగాలి. కానీ కానీ వారి భాషకు గుర్తింపు దక్కలేదు. దాంతో వారు తమ భాషకు గుర్తింపు కావాలని ఉద్యమం చేపట్టారు. 1952 నుంచి సుమారుగా 4 ఏండ్ల పాటు దీనికోసం ఉద్యమించారు. కానీ ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం 1952 ఫిబ్రవరి 21 న వారిపై కాల్పులు జరిపింది. చివరకు బంగ్లాదేష్ ఆవిర్షావానికి దారితీసింది. 

కెనడాకు చెందిన ఇద్దరు నాన్ రెసిడెంట్ బంగ్లాదేశీయులైన రఫీకుల్ ఇస్లాం, అబ్దుస్ సలాం లు 1998 లో అప్పటి ఐక్యరాజ్య సమితి కార్యదర్శి అయిన కోఫీ అన్నన్ కు లేఖ రాశారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తే.. కనుమరుగవుతున్న భాషలను రక్షించుకోగలమని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను 1999 సంవత్సరంలో యునెస్కో ఆమోదం తెలిపింది.  అందుకే బంగ్లాదేష్ లో ఈ రోజును జాతీయ సెలవుదినంగా జరుపుకుంటారు.