వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించినందుకు పెద్ద కుమారుడిని హత్య చేసిన తల్లి.. యూపీలో ఘటన
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించినందుకు ఓ తల్లి కర్కషత్వానికి ఒడిగట్టింది. పెద్ద కుమారుడిని ప్రియుడు, చిన్న కుమారుడి సాయంతో హత్య చేసింది.
వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికి అయిన ఒడిగట్టేలా చేస్తున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిందనుకు ఓ తల్లి తన పెద్ద కుమారుడిని హత్య చేయించింది. దీని చిన్న కుమారుడు, ఆమె ప్రియుడు కూడా సాయం చేశాడు.
Viral: పులికి మాంసం ముద్దలు.. పెద్ద సాహసమే..!
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త అనుజ్ కుమార్ అలియాస్ సమర్ (27) జూలై 18వ తేదీ నుంచి కనిపించడం లేదని అంజలి అనే మహిళ ఘజియాబాద్ జిల్లాలోని మోదీ నగర్ పోలీసులకు జూలై 18వ తేదీన ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును జులై 21వ తేదీన అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆగస్టు 3వ తేదీన నివారి రోడ్డులోని దర్గా వెనుక తన బావ అనూజ్ మృతదేహం పడి ఉందని అంజలి సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు.
చిన్నారుల హక్కులు, మహిళల రక్షణ: సమాజాభివృద్ధి కోసం పోరాడుతున్న ఎన్జీవోలు..
తన భర్త మృతి విషయంలో తన అత్తగారు కృష్ణ దేవి, చిన్న కుమారుడు అభిషేక్పై తనకు అనుమానం ఉందని అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ హత్యలో కృష్ణ ప్రియుడు దేవేంద్ర ప్రమేయం కూడా ఉందని అనుమానించి పోలీసులు అతడి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. వారిద్దరికి వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని దేవేంద్ర విచారణలో అంగీకరించారు.
Vice presidential election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. జగదీప్ ధంఖర్ ఎన్నిక ఖాయమేనా..?
ఈ వివాహేతర సంబంధం అనూజ్ కు తెలియడంతో దీనిని అతడు తీవ్రంగా వ్యతిరేకించాడు. నిరసన వ్యక్తం చేశాడు. దీనిని తట్టుకోలేని తల్లి కృష్ణ కుమారుడిని అంతం చేయాలని ప్లాన్ చేసింది. ప్రియుడు, చిన్న కుమారుడితో కలిసి అతడి గొంతు కోసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఆలయం వెనక పడేశారని ఎస్పీ తెలిపారు. కృష్ణ, అభిషేక్లను శుక్రవారం రాజ్ టాకీస్ చౌరస్తా నుంచి అరెస్టు చేశామని, అనంతరం జైలుకు తరలించారని ఎస్పీ పేర్కొన్నారు. అయితే మరో నిందితుడు దేవేంద్ర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.