Asianet News TeluguAsianet News Telugu

ఒత్తిడికి తలొగ్గిన మోడీ సర్కార్: ఎట్టకేలకు అవిశ్వాసంపై చర్చకు సిద్ధం

 పార్లమెంట్  వర్షాకాల సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విబజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ  కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింది.  ఇదిలా ఉంటే ఈ సెషన్‌లో కీలకమైన పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని  కేంద్రం భావిస్తోంది.

Monsoon Session Of Parliament LIVE Updates: Lok Sabha, Rajya Sabha To Table Key Bills

న్యూఢిల్లీ: పార్లమెంట్  వర్షాకాల సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విబజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ  కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింది.  ఇదిలా ఉంటే ఈ సెషన్‌లో కీలకమైన పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని  కేంద్రం భావిస్తోంది

*అన్ని పార్టీల ఎంపీల తీర్మాణాలను చదవి విన్పించినట్టు స్పీకర్ ప్రకటించారు.

*టీడీపీ తీర్మాణం మాత్రమే చదివి విన్పించారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం చెప్పారు..

*10 రోజుల్లో అవిశ్వాస తీర్మాణంపై చర్చ ప్రవేశపెట్టే తేదీని ప్రకటించనున్నట్టు సుమిత్రా మహాజన్ ప్రకటించారు

*రూల్స్‌కు అనుగుణంగానే తాను అవిశ్వాస తీర్మాణంపై చర్చను చేపట్టనున్నట్టు స్పీకర్ ప్రకటించారు

*టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు

*టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసులు అందాయని ప్రకటించిన స్పీకర్ మహజన్

*రాజ్యసభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై ఎప్పుడు చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మెన్ అభిప్రాయపడ్డారు.

*తాము ఇచ్చిన డిమాండ్లపై తక్షణమే చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ పట్టుబట్టారు
* రేపు కానీ, ఎల్లుండి కానీ  ప్రత్యేక హోదా అంశంపై చర్చకు సిద్దమని ప్రకటించిన రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.
* రాజ్యసభలో చర్చకు సిద్దమని ఛైర్మెన్ ప్రకటించారు.

*ప్రారంభమైన రాజ్యసభ

*లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాతే ఇతర కార్యక్రమాలు చేపడుతానని ప్రకటించిన స్పీకర్ సుమిత్రా మహాజన్

*మధ్యాహ్నం 12 గంటలవరకు రాజ్యసభ వాయిదా

*రాజ్యసభ వాయిదా పడింది

* కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
* లోక్‌సభలో గందరగోళం
* అవిశ్వాసంపై చర్చకు టీడీపీ డిమాండ్
* స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన

 *టీడీపీ ఎంపీల ఆందోళన మద్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి

 *ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు

* ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ చేపట్టారు. ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎంపీలకు లోక్‌సభ సంతాపాన్ని ప్రకటించింది.

*కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రమాణం చేయించారు.

*రాజ్యసభలో కూడ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు


 

Follow Us:
Download App:
  • android
  • ios