Maoism: నక్సలిజం అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలైట్లు లేకుండా చేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో నక్సలిజానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేంటీ నక్సలిజం.?
నక్సలిజం అనేది భారతదేశంలో ఏళ్ల నుంచి కొనసాగుతోన్న ఒక అతివాద ఉద్యం. ఈ ఉద్యమానికి సాధారణంగా “నక్సలైట్” లేదా “మావోయిజం” అనే పేరు ఉపయోగిస్తారు. నక్సలిజం పేరు 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామం నుంచి వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ పేరు మీదుగానే నక్సలిజం అనే పేరు వచ్చింది. అక్కడ వ్యవసాయ కార్మికుల బలవంతమైన తిరుగుబాటుతో మొదలై అది తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపించింది.
నక్సలిజం ఎలా మొదలైంది?
నక్సలిజం మూల కారణాలను అర్థం చేసుకోవాలంటే 1960ల చివరి దశలూ, దేశీయ-అంతర్జాతీయ రాజకీయ పరిస్దితులను గమనించాలి.
భూ సమస్యలు: మెజారిటీ భూమి భూస్వాముల చేతుల్లో ఉండేది. దీంతో పేద రైతులకు ఉపాధి లేని పరిస్థితి. అలాగే గ్రామాల్లో భూస్వాముల అరాచకాలు పెరగడంతో వ్యతిరేకత మొదలైంది.
చైనా-ప్రేరిత మార్గం: చైనా రేవల్యూషన్ (మావో జెదాంగ్) ద్వారా వచ్చిన ఆలోచనలు, కార్ల్ మార్క్స్ — లెనిన్ సిద్ధాంతాల భావాలు స్థానిక కార్యకర్తలకు ఆకర్షణీయంగా నిలిచాయి. చారూ మాజుమ్దార్ వంటి నాయకుల ప్రభావం.
నక్సల్బరీ సంఘటన: 1967లోని రైతు తిరుగుబాటు ఈ ఉద్యమానికి ఆరంభ బిందువుగా చెబుతారు. నక్సల్బరి అనేది ఒక గ్రామం పేరు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్డివిజన్లోని హిమాలయపర్వతాల దగ్గర ఉన్న గ్రామం. గ్రామ జనాభాలో అత్యధికులు సంథాల్ గిరిజనులు. ఈ గిరిజన రైతాంగాన్ని స్థానిక భూస్వాములు (జోతేదార్లు) దోపిడీకి పీడనకు గురిచేసేవారు. 1967 మార్చి 3న ఆ గ్రామరైతులు జోతేదారు పంటపొలాన్ని ఆక్రమించుకుని, అందులో ఎర్ర జెండాలు పాతి పంటను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతపు రైతు సంఘం ఈ చర్యను ప్రశంసిస్తూ భూమి మీద భూస్వాముల గుత్తాధిపత్యాన్ని రద్దుచేయాలని, రైతు కమిటీల ఆధ్వర్యంలో భూపంపిణీ జరగాలని, భూస్వాములను నిరోధించడానికి రైతులను సంఘటితపరిచి సాయుధ పోరాటం చేయాలని పిలుపునిచ్చింది. ఇలా నక్సలిజం ఒక రైతు/గిరిజన సమస్యగా ప్రారంభమై, ఆ తర్వాత ఆలోచనా స్థాయిలో మారి ఆయుధ పోరాటంగా మారింది.
వ్యూహాత్మక పరిణామాలు
నక్సల్ ఉద్యమం ఒకే సంస్థకు పరిమితం కాకుండా ఆ తర్వాత పలు విభాగాలుగా విస్తరించింది. వీటిలో ప్రధానమైనవి..
CPI (Marxist–Leninist) – 1969: చారూ మాజుమ్దార్ నేతృత్వంలో CPI(ML) ఏర్పడింది.
People’s War Group (PWG) – 1980): ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏర్పడి, దక్షిణ భారతంలో శక్తిని పెంచుకుంది.
Maoist Communist Centre (MCC) – బీహార్లోని గ్రామీణ ప్రాంతం కేంద్రంగా ఈ సంస్థ ఏర్పడింది.
మిలిటరీ సంయోగం (2004): 2004లో PWG, MCC విలీనం అవుతూ Communist Party of India (Maoist) అనే భారీ అభివృద్ధి సంస్ధ ఏర్పాటు అయింది.
నక్సలిజం వృద్ధికి కారణం ఏంటి.?
నక్సలిజం దేశంలో విస్తరించడానికి ప్రధాన కారణాలు ఇవే..
* ఆదివాసీ, దళిత వర్గాల చెందిన వారికి భూమి దక్కకుండా చేయడం, పేదరికం పెరిగిపోవడం.
* కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో విద్య, దవాఖానలు, రహదారులు లేకపోవడం. అభివృద్ధికి నోచుకోకపోవడం.
* ప్రకృతి సంపదను దోచుకోవడంతో పర్యావరణ, సామాజిక మార్పులు.
నక్సలిజం ప్రస్తుతం ఎలా ఉంది?
ప్రస్తుతం నక్సలిజం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నక్సలిజం అంతానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
* 2010లో నక్సల్స్కు సంబంధించిన హింస ఘటనలు గరిష్టంగా 1936 జరగగ్గా, 2024 నాటికి ఆ సంఖ్య 374కి తగ్గింది.
* నక్సల్స్ దాడిలో 2010 సమయంలో మరణించిన పౌరులు, భద్రతా బలగాల సంఖ్య 1005గా ఉండగా, 2024కి 150కి పడిపోయింది.
* 2013లో నక్సలిజ ప్రభావం 126 జిల్లాలకు ఉండగా 2024 నాటికి 38 జిల్లాలకు పరితమైంది.
* ఇక ఆపరేషన్ కగార్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్తో నక్సలిజంపై భారీ ప్రభావం పడింది. మావోయిస్టులకు కంచుకోటగా చెప్పుకునే కర్రెగుట్టపై భద్రతా బలగాలు జాతీయ జెండాను ఎగరవేశారు.
నక్సలిజం ప్రాభవ్యం ఎందుకు కోల్పోతుంది.?
గ్రామీణ అభివృద్ధి వెనుకబాటుతనం:
నక్సలిజం ఎక్కువగా ప్రభావం చూపిన ప్రాంతాలు అభివృద్ధి లో వెనుకబడ్డాయి. స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్ల నిర్మాణం ఆగిపోయాయి. ప్రభుత్వ పనులు ఆగిపోయాయి. ఇదే స్థానికులు నక్సలిజానికి దారితీసిందని కొందరు వాదించినా, నిజానికి ఎక్కువ మంది ప్రజలు హింస వల్లే నష్టపోయారు.
ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం:
నక్సల దాడుల్లో వేలాది మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వేలు, విద్యుత్ టవర్స్, ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ విధ్వంసం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారమైన నష్టం పడింది.
మానవ హక్కుల చర్చలు:
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఎన్కౌంటర్లు, గ్రామీణ పునరావాసం వంటి అంశాలపై హ్యూమన్ రైట్స్ సంస్థలు ప్రశ్నలు లేవనెత్తాయి. కేవలం సైనిక చర్యలతో కాదు, అభివృద్ధి కార్యక్రమాలతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమని చెప్పడంలో సందేహం లేదు.
భవిష్యత్తు మార్పులు
భారత ప్రభుత్వం 2026 నాటికి "నక్సల రహిత భారత్" లక్ష్యం పెట్టుకుంది. ఇప్పటికే వందలాది మావోయిస్టులు లొంగిపోయారు. అలాగే విద్య, ఆరోగ్యం, భూమి హక్కులపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రజలు తిరిగి నక్సలిజం వైపు వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. మరోవైపు, మావోయిస్టులు పాత తరహా దాడులు తగ్గించి, రిమోట్ బాంబులు, IEDలు వాడే విధానానికి మారుతున్నారు. అంటే చిన్న స్థాయి హింస కొనసాగొచ్చు కానీ పెద్ద ఎత్తున తిరుగుబాటు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతోంది.
రాజకీయ, సామాజిక అంశాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గిరిజన సంక్షేమ పథకాలు కలిసి నక్సలిజం భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇప్పటికే పెద్ద ఆపరేషన్లు, గ్రామీణ పథకాలు మావోయిస్టు ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయి.
నక్సలిజం ఎందుకు తగ్గిపోతుంది?
* భద్రతా బలగాల కఠిన చర్యలు
* ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు
* గ్రామీణ ప్రజలకు విద్య, ఆరోగ్య సదుపాయాల పెంపు
* మావోయిస్టు గ్రూపులలో అంతర్గత విభేదాలు
* ప్రజలలో హింస పట్ల పెరిగిన వ్యతిరేకత
నక్సలిజం ఒకప్పుడు పేద, బడుగు వర్గాల అన్యాయాలపై పోరాటంగా మొదలైంది. కానీ అది కాలక్రమంలో ఆయుధ హింసగా మారి ప్రజలకు మరింత కష్టాలకు దారి తీసింది. ఇప్పుడు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు, ప్రజల అవగాహన, అభివృద్ధి పథకాలు కలిసి నక్సలిజం ప్రభావాన్ని తగ్గిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
