Mann Ki Baat: ఆదివారం తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రపంచంలో భారతీయ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ఇటీవల భార‌త్ తన ప్రతిష్టాత్మక ఎగుమతి లక్ష్యమైన $400 బిలియన్లను అధిగమించింద‌నీ, 'ఆత్మనిర్భర్'గా ఒక అడుగు ముందుకు వేసింద‌ని పేర్కొన్నారు.  

Mann Ki Baat: "ప్రతి భారతీయుడు స్థానికత కోసం గళం విప్పినప్పుడు, స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావడానికి ఎక్కువ సమయం పట్టదు" అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. దేశ ప్ర‌జ‌లు, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఆదివారం నాడు తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' (Mann Ki Baat) లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రపంచంలో భారతీయ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. భారతదేశం ఇటీవల మార్చిలో దాని ప్రతిష్టాత్మక ఎగుమతి లక్ష్యమైన $400 బిలియన్లను అధిగమించింద‌ని తెలిపారు. ఇది ప్ర‌తిష్ఠాత్మ‌క 'ఆత్మనిర్భర్'గా ఒక అడుగు ముందుకు వేసింద‌ని తెలిపారు. 

“భారతదేశం ఇటీవల మార్చిలో దాని ప్రతిష్టాత్మక ఎగుమతి లక్ష్యమైన $400 బిలియన్లను అధిగమించింది. ఇది ప్ర‌తిష్ఠాత్మ‌క 'ఆత్మనిర్భర్'గా ఒక అడుగు ముందుకు వేసింది. ఇది భారతదేశ సామర్థ్యాలు మరియు సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో భారతీయ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని అర్థం' అని ప్రధాని మోడీ అన్నారు. "ఇది మనలో గర్వాన్ని నింపింది, ఇది భార‌త‌దేశ సామర్థ్యాన్ని & నైపుణ్యాల‌ను, శ‌క్తిని సూచిస్తుంది" అని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. భాతదేశం నుండి కొత్త ఉత్పత్తులు ప్ర‌పంచంలోని కొత్త గమ్యస్థానాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపిన ప్ర‌ధాని మోడీ.. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులు ఇప్పుడు విదేశాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్ల‌డించారు. 

"ప్రతి భారతీయుడు స్థానికత కోసం గళం విప్పినప్పుడు, స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావడానికి ఎక్కువ సమయం పట్టదు అని ప్రధాని మోడీ త‌న మ‌న్ కీ బాత్ లో పేర్కొన్నారు. "ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల సంఖ్య 100 బిలియన్లు, కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లుగా ఉంది. అయితే, ప్ర‌స్తుతం భారతదేశం ఎగుమ‌తులు 400 బిలియన్ డాలర్లకు చేరుకుంది" అని చెప్పారు. ఇందులో చిన్న పారిశ్రామికవేత్తలు విజయం సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ క్ర‌మంలోనే దేశవ్యాప్తంగా ల‌భించే వివిధ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల గురించి కూడా ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తావించారు. 

Scroll to load tweet…

"లడఖ్‌లోని నేరేడు పండు, తమిళనాడు అరటిపండ్లు, హిమాచల్‌లోని మిల్లెట్‌లు వంటి అనేక పండ్లు మరియు కూరగాయలు యావ‌త్ ప్ర‌పంచ దేశాల‌కు ఇక్క‌డి నుంచిచేరుతున్నాయి. 'మేక్ ఇన్ ఇండియా' ఉత్పత్తుల జాబితా మన రైతులు, తయారీదారులు మరియు పరిశ్రమల సామర్థ్యం మరియు కృషి కి నిద‌ర్శ‌నంగా నిలుస్తోందిత‌" అని ప్రధాని మోడీ అన్నారు. "బీజాపూర్ పండ్లు మరియు కూరగాయల నుండి చందోలి నుండి నల్ల బియ్యం వరకు.. అన్ని ఇప్పుడు భారీగా ఎగుమ‌తి అవుతుండ‌టాన్ని చూస్తున్నాము. మన ఎగుమతులు ఇతర దేశాలలో డెన్మార్క్, దక్షిణ కొరియా, లండన్, కెన్యా వంటి కొత్త గమ్యస్థానాలకు సరఫరా చేయబడుతున్నాయి" అని తెలిపారు. 

Scroll to load tweet…

"ప్రతి భారతీయుడు లోకల్ కోసం గళం విప్పినప్పుడు, లోకల్ గ్లోబల్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. స్థానికత‌ను 'గ్లోబల్'గా మారుద్దాం.. మన ఉత్పత్తుల ప్రతిష్టను మరింత పెంచుకుందాం" అని దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. నేడు మన చిన్న వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ - జిఇఎమ్ ద్వారా ప్రభుత్వ సేకరణలో ప్రధాన భాగస్వామ్య పాత్రను పోషిస్తున్నారు. సాంకేతికత ద్వారా మరింత పారదర్శక వ్యవస్థ అభివృద్ధి చేయబడింద‌ని పేర్కొన్నారు. భారతదేశం మార్చి 23న, ల‌క్ష్యంగా పెట్టుకున్న స‌మ‌యం కంటే తొమ్మిది రోజుల ముందుగానే 400 బిలియన్ల USDల అత్యధిక వస్తువుల ఎగుమతి లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించింద‌ని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 292 బిలియన్ డాలర్లు కాగా, 2021-22లో ఎగుమతులు 37 శాతం వృద్ధితో 400 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.