Lakhimpur Kheri: గదర్ 2 సినిమా చూసేందుకు సినిమా హాల్ కు వెళ్లిన 32 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదానికి సంబంచిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ల‌ఖింపూర్ ఖేరీకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి గదర్ 2 సినిమా చూసేందుకు వచ్చిన సినిమా హాల్ వద్ద గుండెపోటుతో మరణించాడు. మెట్లు ఎక్కుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటన హాల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. 

Ghadar 2-man dies of heart attack: గదర్ 2 సినిమా చూసేందుకు సినిమా హాల్ కు వెళ్లిన 32 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదానికి సంబంచిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ల‌ఖింపూర్ ఖేరీకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి గదర్ 2 సినిమా చూసేందుకు వచ్చిన సినిమా హాల్ వద్ద గుండెపోటుతో మరణించాడు. మెట్లు ఎక్కుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటన హాల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివ‌రాల్లోకెళ్తే... ఇటీవల విడుదలైన గదర్-2 సినిమా చూసేందుకు వెళ్లిన 32 ఏళ్ల వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలోని ఓ సినిమా హాలులో గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన సినిమా హాల్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అష్టక్ తివారీ అనే వ్యక్తి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా మెట్లు ఎక్కి కుప్పకూలిపోయాడని సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. శనివారం రాత్రి 7.50 గంటల సమయంలో గదర్-2 సినిమా ప్రదర్శన కోసం తివారీ నగరంలోని ఫన్ సినిమా హాల్ కు చేరుకున్నారు. మెట్లు ఎక్కిన తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో చుట్టుపక్కల వారు అతడికి సహాయం చేసేందుకు అక్క‌డికి చేరుకున్నారు.

అయితే, ఈ క్ర‌మంలోనే ఆయ‌న గుండెపోటులో ప్రాణాలు కోల్పోయారు. తివారీ ఫోన్ అన్ లాక్ చేయబడిందనీ, అక్కడ ఉన్న గార్డులు, బౌన్సర్లు అతని ఫోన్ తో వారి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించార‌ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎఎస్పి) నైపాల్ సింగ్ చెప్పారు. వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
 అడిషనల్ ఎస్పీ నైపాల్ సింగ్ ఈ మరణాన్ని ధృవీకరించారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. మృతుడు సదర్ కొత్వాలి ప్రాంత పరిధిలోని ద్వారకాపురి ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగా గుర్తించారు.

ఇటీవల కాన్పూర్ లో గదర్-2 స్క్రీనింగ్ లో ఎయిర్ కండిషనింగ్ సరిగా లేకపోవడంతో బౌన్సర్లకు, అక్కడి ప్రజలకు మధ్య వివాదం తలెత్తింది. మొదట్లో మాటల యుద్ధం జరిగినా సమస్య తీవ్రరూపం దాల్చి ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునే వ‌ర‌కు చేరింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.