ఏనుగు ఒక్కసారిగా మీద పడితే.. ఎంత గట్టి ప్రహరీగోడలైనా.. ఎంత గట్టి ఇల్లైనా ఆగదు. అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. ఓ అడవి ఏనుగు జనావాసాల్లోకి వచ్చి ఓ వ్యక్తిపై దాడి చేసింది. 

వాయనాడ్ : కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. అడవి ఏనుగు దాడిలో గాయపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం (ఫిబ్రవరి 10) తెల్లవారుజామున జరిగింది. ఈ దాడిలో పయ్యంపల్లికి చెందిన అజి అనే వ్యక్తి గాయపడి మరణించాడు. రేడియో కాలర్‌ ఉన్న కర్ణాటకకు చెందిన ఏనుగు వయనాడ్‌కు వచ్చింది. ఈ ఏనుగు మొదట మనంతవాడి ప్రాంతంలోని జనజీవనాల్లోకి ప్రవేశించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అటవీశాఖ అధికారులు ఈ జంబో ఎలిఫెంట్ ను తరిమేశారు. అయితే ఆ తర్వాత అది పడమల ప్రాంతంలో అజీపై దాడి చేసింది. మృతుడి ఇంటి ప్రాంగణంలో సరిహద్దు గోడలను పగులగొట్టింది. ఇంట్లోకి చొరబడిన ఏనుగు అజీపై దాడి చేసింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మరికొందరు అదృష్టవశాత్తూ దాడి నుంచి తప్పించుకున్నారు. మృతదేహాన్ని మనంతవాడి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

Miss World 2024 : ముప్పై ఏళ్ల తరువాత భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు...

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఏనుగుల దాడి నేపథ్యంలో కురుక్కన్ముల, పయ్యంపల్లి కురువ, కడన్‌కొల్లి సహా మనంతవాడి మున్సిపల్ కార్పొరేషన్‌లోని నాలుగు వార్డుల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు.
అటవీ శాఖ మంత్రి ఎ.కె. శశీంద్రన్ మాట్లాడుతూ.. ఇటీవల వయనాడ్ నుంచి ఇలాంటి ఘటనలు చాలా వినిపిస్తున్నాయన్నారు. 

ఏనుగును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అటవీశాఖ ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రజలకు లబ్ధి చేకూరడం లేదని, మరిన్ని బృందాలను పంపి ప్రస్తుత పరిస్థితిని పరిష్కరిస్తామన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో ఏనుగు ఉన్నట్లు అటవీశాఖ అధికారులకు తెలిసినా అధికారులు జోక్యం చేసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.