Asianet News TeluguAsianet News Telugu

భార్యపై ప్రేమ.. ఇంట్లోనే పూడ్చిపెట్టి, అంత్యక్రియలు.. భయాందోళనల్లో స్థానికులు.. చివరికి..

భార్యపై ప్రేమతో ఆమె చనిపోతే.. ఆ దు:ఖాన్ని, ఎడబాటును భరించలేక ఇంట్లోనే ఆమె శవాన్ని పూడ్చిపెట్టాడో భర్త. కానీ విషయం తెలిసిన ఇరుగుపొరుగు వారు భయాందోళనలకు గురయ్యారు. 

man buries wife's body inside home, locals protest in Madhya Pradesh
Author
First Published Aug 27, 2022, 8:32 AM IST

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లోని డిండౌరీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై ప్రేమతో ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టుకున్నాడు.  అంత్యక్రియలు పూర్తి చేశాడు. డిండౌరీలోని వార్డ్ నెంబర్ 14 లో నివాసముంటున్న ఓంకార్ దాస్ స్థానికంగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయనకు పాతికేళ్ల క్రితం రుక్మిణి అనే మహిళతో వివాహం అయింది. సంతానం లేకున్నా.. భార్య భర్తలు అన్యోన్యంగా జీవించేవారు. రుక్మిణి అనారోగ్యంతో ఆగస్టు 23న మృతి చెందింది. ఆ బాధను తట్టుకోలేక పోయిన ఓంకార్ దాస్..  ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. 

ఈ విషయం తెలిసి భయాందోళనకు గురైన ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టరేట్ కు చేరుకుని ఎస్డీఎం బల్వీర్ రామన్ కు ఫిర్యాదు చేశారు.ఎస్డీఎం ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ గోవింద రామే పోలీసులతో కలిసి ఉపాధ్యాయుడు ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీసి నర్మదా నది ఒడ్డున పాతిపెట్టారు. దీంతో ఇరుగుపొరుగు ఊపిరి పీల్చుకున్నారు. 

జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల ‘గుప్త’ విరాళాలు.. ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకే అధికం.. తేల్చిన ఏడీఆర్..

ఇదిలా ఉండగా, భార్యమీది ప్రేమతో భర్త ఎంతవరకైనా పోతాడన్న విషయాన్ని తెలిపే మరో ఘటన తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఆగస్ట్ 20న చోటుచేసుకుంది. సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్లో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతీ యువకులు తమ ప్రేమకు, పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. వివాహం చేసుకుని సికింద్రాబాద్ కు వచ్చి కాపురం పెట్టారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. డెలివరీ సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యువతి పురిట్లోనే కన్నుమూసింది.  ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇక లేదన్న బాధను తట్టుకోలేక.. ఆ భర్త కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

దీంతో  రోజుల చిన్నారి అనాధగా మిగిలిపోయింది. ఈ హృదయ విదారక ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ జిఆర్ పి పోలీసుల కథనం ప్రకారం... నారాయణపేట జిల్లా మక్తల్ కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్ (28) తన ఇంటి పక్కనే ఉండే భీమేశ్వరి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఏడాది క్రితం వీరిద్దరూ పెళ్లి చేసుకుని నగరానికి వచ్చేశారు. ఇక్కడ మౌలాలి ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు. నవీన్ కుమార్ ఆటో నడుపుతున్నాడు. 

ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో భీమేశ్వరికి ప్రసవం అయ్యింది. భీమేశ్వరి పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లితో పాటు శిశువును గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. శిశువు వెంటిలేటర్పై ఉంచారు. చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి ఆస్పత్రిలో మృతి చెందింది.  చిన్నారి వెంటిలేటర్పై, మార్చురీలో  భార్య మృతదేహం.. ఉండటంతో  నవీన్ కుమార్  తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బాధను భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios