Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : యూట్యూబ్ లో చూసి ప్రియురాలిని చంపి, ముక్కలుగా చేసి.. బావిలో పడేసి.. దారుణం..

ఓ వ్యక్తి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోందని యూట్యూబ్ లో వీడియోలు చూసి.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. 
 

man assassinated lover over extramarital affair in rajasthan - bsb
Author
First Published Feb 8, 2023, 9:32 AM IST

రాజస్థాన్ : వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పెళ్లై, సంతోషంగా సంసారాలు చేసుకుంటున్న ఇద్దరి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం ఆ కుటుంబాలను చిన్నాభిన్న చేస్తుంది. నువ్వు నీ భార్యను వదిలేయి, నేను నా భర్తను వదిలేస్తాను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని ఆ ప్రియురాలు చేసిన ప్రపోజల్  ప్రియుడిని అయోమయంలో పడేసింది. అంతే ఆమెను హత్య చేసి జైలు పాలయ్యాడు.  రాజస్థాన్ లోని నాగోర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..  రాజస్తాన్ నాగౌర్ జిల్లాలోని శ్రీ బాలాజీ కాలనీకి చెందిన అనుపమ రామ్ అనే వ్యక్తి తన పక్కింట్లో ఉన్న వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పక్కింటి వ్యక్తితో మంచిగా మాట్లాడుతూనే అతని భార్యతో ఇలాంటి నీచ పనికి పూనుకున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి అది వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఆ మహిళ అనోపరామ్ ని నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించింది. వివాహేతర సంబంధాలకు పునాది అయిన శారీరక సంబంధం మాత్రమే కాదు అతనితో కలిసి జీవితాంతం ఉండాలనుకుంది.

అయితే అనోపరామ్ మాత్రం కేవలం శారీరక సంబంధం వరకే పరిమితం కావాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ప్రియుడి మీద తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తన తన భర్తను వదిలేసి వస్తానని.. నువ్వు నీ భార్యను వదిలేసి రమ్మని కోరింది. అయితే,  అలా చేయడానికి అనోపరామ్ ఒప్పుకోలేదు. అతనికి భార్యను వదిలేసి ప్రియురాలితో వెళ్లడం ఇష్టం లేదు. మరోవైపు ప్రియురాలి ఒత్తిడి ఎక్కువవుతుంది. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం యూట్యూబ్లో వీడియోలు చూశాడు.

ఆగ్రాలో అక్రమంగా నివసిస్తున్న 32 మంది బంగ్లాదేశీయుల అరెస్టు

వాటి ప్రకారం ప్రియురాలిని చంపడానికి ప్లాన్ వేశాడు. కలవాలని చెప్పి ప్రియురాలిని రమ్మని కబురు పెట్టాడు. అనోపరామ్ ను కలవడానికి ఆ మహిళ జనవరి 22న బయలుదేరింది. ఇంట్లో మాత్రం తాను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వచ్చింది. అయితే, రెండు రోజులు గడుస్తున్నా ఆమె పుట్టింటికి వెళ్లలేదు.. ఇటు మెట్టినింటికి రాలేదు. దీంతో ఆమె భర్త, తల్లిదండ్రులు కంగారుపడి జనవరి 24వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా కనబడకుండా పోయిన మహిళకు.. వారి పక్కింట్లో ఉండే అనోపరామ్ కు  వివాహేతర సంబంధం ఉందన్న విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులు అనోపరామ్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అనోపరామ్ నిజం ఒప్పుకున్నాడు. జనవరి 22న  తనను కలవడానికి వచ్చిన ప్రియురాలిని బల్వా రోడ్డులోని అడవిలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.  

ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోసి అడవిలోని ఓ బావిలో పడేసానని చెప్పాడు. అనోపరామ్ వివరాల మేరకు పోలీసులు ఆ బావి వద్దకు వెళ్లి వెతకగా ఆ చుట్టుపక్కల మహిళ బట్టలు, వెంట్రుకలు దొరికాయి. ఆ మహిళ శరీర భాగాల కోసం బావిలోకి దిగి గాలింపు చేపట్టారు. మూడు రోజులుగా శరీర భాగాల కోసం బావిలో గాలింపు చేస్తున్నారు. ఈవిషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా  మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios