Maharashtra Political crisis: శివసేన ఎవరిది? ఠాక్రే పిటిషన్ను స్వీకరించిన సుప్రీం.. విచారణ ఎప్పుడంటే..?
Maharashtra Political Cisis: మహారాష్ట్రలో రాజకీయసంక్షోభం కొనసాగుతోంది. అసలైన శివసేనను గుర్తించాలని ఏకనాథ్ షిండే వర్గం తీసుకున్న చర్యపై ఎన్నికల కమిషన్ చర్యలపై స్టే విధించాలని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సంబంధిత పిటిషన్లతో పాటు ఈ అంశాన్ని కూడా సోమవారం విచారిస్తామని కోర్టు తెలిపింది.
Maharashtra Political crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సాగుతుంది. తొలుత అధికారం కోసం సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేసిన శివసేన తిరుగుబాటుదారులు.. తాజాగా పార్టీని, పార్టీ గుర్తుపై అధిపత్యం సాధించాలని, పార్టీని తమ హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమదే అసలైన శివసేన అని, తనకే పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల మద్దతు ఉందని షిండే వర్గం పేర్కొంది. ఈ క్రమంలో నిజమైన శివసేనగా గుర్తించాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం చేసిన పిటిషన్పై ఎన్నికల కమిషన్ చర్యలను వ్యతిరేకిస్తూ శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో రెండు వర్గాల వారికి ఆగస్టు 8లోగా పార్టీ, దాని ఎన్నికల గుర్తులపై (విల్లు మరియు బాణం) తమ తమ వాదనలకు మద్దతుగా పత్రాలను సమర్పించాలని ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించడంతో ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది.పార్టీ శాసనసభా, సంస్థాగత విభాగాల మద్దతు లేఖలు, ప్రత్యర్థి వర్గాల వ్రాతపూర్వక ప్రకటనలతో సహా అవసరమైన పత్రాలను సమర్పించాలని ఇరువర్గాలను కోరినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. శివసేన ప్రధాన కార్యదర్శి సుభాష్ దేశాయ్ పెండింగ్లో ఉన్న పిటిషన్తో పాటు తాజా దరఖాస్తును దాఖలు చేశారు. ఇందులో ఎన్నికల సంఘాన్ని పార్టీగా మార్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి కూడా కోరింది.
ఈ క్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిజమైన శివసేనగా గుర్తించబడటానికి ఏకనాథ్ షిండే వర్గం ఎత్తుగడపై ఎన్నికల కమిషన్ చర్యలపై స్టే విధించాలని పిటిషన్ దాఖాలు చేశారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్ ను సోమవారం విచారించనుంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టి, థాకరేను ముఖ్యమంత్రిగా దింపిన తర్వాత పార్టీ శ్రేణుల్లో తిరుగుబాటు కారణంగా గుర్తు కోసం గొడవ జరిగింది. ఠాక్రేలకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏక్నాథ్ షిండే ఇప్పుడు బీజేపీ మద్దతుతో సీఎం పదవిని చేపట్టారు.
తనకు 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని షిండే టీమ్ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. థాకరే వర్గం అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది, వ్యతిరేక శిబిరంలోని నాయకులపై ఇరువర్గాలు తరలించిన అనర్హత నోటీసులపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే తప్ప నిజమైన శివసేన ఏది అని ఎన్నికల సంఘం నిర్ణయించదు.
థాకరే వర్గం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నేడు సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఇటీవల మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సమయంలో శివసేన, దాని తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు చీలిక, విలీనం, ఫిరాయింపు, రాజకీయ పార్టీ యొక్క అనర్హత వంటి అనేక రాజ్యాంగ సమస్యలను లేవనెత్తాయని, దీనిపై ప్రధాన న్యాయస్థానం జూలై 20న పేర్కొంది. ఇదిలావుండగా.. ట్రస్ట్ ఓటింగ్, స్పీకర్ ఎన్నిక సందర్భంగా జారీ చేసిన పార్టీ విప్ను ధిక్కరించాలని స్పీకర్ను కోరుతూ జులై 11న ఇచ్చిన ఆదేశాల అమలు గడువును చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పొడిగించింది.