Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌.. కాస్లీ గిప్టులు, బంగారం.. తీరా చూస్తే.. రూ. 1.12 కోట్లు గుల్ల..

ఆన్లైన్ వేదికలో పరిచయాలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించిన కొందరు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని నగలు,  బహుమతులు పంపిస్తానని ఓ మహిళ నుంచి రూ.1.12 కోట్లను కొల్లాగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్‌లో చోటుచేసుకుంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Maharashtra Alibag Woman Loses Over Rs One Cr To Fraudsters Who Promised Her Gift From UK
Author
First Published Nov 19, 2022, 6:27 PM IST

ఆన్ లైన్ మోసాలకు ప్రధాన కారణం మనిషి అత్యాశ. ఆ అత్యాశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో స్నేహం చేస్తున్నట్టు నమ్మించి..  బహుమతులు, బంగారం పంపిస్తామని ఓ మహిళ నుంచి రూ.1.12 కోట్లను కొల్లాగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్‌లో చోటుచేసుకుంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని అలీబాగ్‌కు చెందిన ఓ మహిళ గతేడాది కోర్టు సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేసింది. ఆమె ఇంటి వద్దే ఉంటూ.. సోషల్ మీడియాలో చాలా చురుకగా ఉండేది. ఈ క్రమంలో ఓ సోషల్ మీడియా వేదికలో బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ వచ్చింది. దీంతో సదరు మహిళ   ఫ్రెండ్ రిక్వెస్ట్‌ ను వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత.. అతనితో చాట్ చేయడం ఫోన్లు మాట్లాడం జోరుగా సాగింది. కొన్ని రోజుల తరువాత ఆ వ్యక్తితో పాటు మరికొందరు ఆ మహిళకు ఫోన్ చేయడం ప్రారంభించారు. ఆమెతో స్నేహం చేస్తున్నట్టు నటించారు.

 ఈ క్రమంలో యూకే నుంచి తనకు బంగారం, నగదు బహుమతులు పంపిస్తామని, అందుకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని వారు నమ్మించారు. దీంతో ఆ మహిళ ముందు వెనుక ఆలోచించకుండా.. ఆ వ్యక్తికి రూ.1.12 కోట్లు బదిలీ చేసింది. దీని తర్వాత వ్యక్తి , అతని సహచరులు వారి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. అప్పుడు ఆమెకు తెలిసి వచ్చింది.. తాను మోసపోయానని, వారు బహుమతుల పేరులో తన నుంచి భారీ మొత్తంలో నగదు కాజేశారని తెలుసుకుంది. దీంతో ఆ మహిళ అలీబాగ్ పోలీసులకు సమాచారం అందించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు చీటింగ్, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, కుట్ర కేసు నమోదు చేసినట్లు అలీబాగ్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సైబర్ మోసాన్ని ఎలా నివారించాలి

>> ఏదైనా తెలియని లింక్‌పై క్లిక్ చేయవద్దు.

>> మీ OTP మరియు ATM పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.

>> ఫ్రీబీస్ కాల్‌లపై అలర్ట్ పొందండి.

>> ఎవరైనా మీ ఖాతా KYC కోసం కాల్ చేస్తే, మీరే బ్యాంకుకు వెళ్తారని చెప్పండి.

>> ఎవరైనా ఖాతా సంబంధిత సహాయం పేరుతో కాల్ చేసి, యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగితే, ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేయండి. 

>> అనుమానిత ఇ-మెయిల్‌లు, SMS  సందేశాలను తెరవడం లేదా క్లిక్ చేయడం మానుకోండి.

>> ఇమెయిల్‌లు, వెబ్‌సైట్‌లు మరియు తెలియని ఇ-మెయిల్ పంపేవారి స్పెల్లింగ్‌ని ఒకసారి చెక్ చేయండి.

>> వేర్వేరు సైట్‌లలో మీ పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయవద్దు. పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చండి. పాస్‌వర్డ్‌లను కష్టతరం చేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios